మూడు ముక్కల రాజధాని, రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్ డీఏ) రద్దు బిల్లులపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేసింది. అమరావతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దును వ్యతిరేకిస్తూ హైకోర్టులో వంద వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది క-రో-నా నేపధ్యంలో వర్చువల్ ద్వారా విచారణ జరపాలని హైకోర్టులో ప్రయత్నించింది. అయితే సాధ్యపడలేదు. రెండోదశ వైరస్ వ్యాప్తి విజృంభణతో అసలు విచారణ జరుగుతుందా.. లేదా అనేది సందేహాలు ఉన్న వేళ, ఈ సారి కూడా హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పిటీషనర్ తరుపు న్యాయవాదులు విజ్ఞప్తి మేరకు, వైరస్ వ్యాప్తి నేపధ్యంలో, కేసుని ఆగస్టు 23కు కేసుని వాయిదా వేసింది. దీంతో తొందరగా విశాఖ వెళ్ళిపోదాం అని అనుకున్న ప్రభుత్వానికి, మళ్ళీ ఆగష్టు నెల దాకా ఎదురు చూడటం, అలాగే అప్పుడు వాదనలు మొదలు అయితే, మరొక మూడు నెలలకు పైగా టైం పడుతూ ఉండటంతో, ఈ ఏడాది కూడా విశాఖ వెళ్ళిపోదాం అనే ఆలోచనకు బ్రేక్ పడింది అనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతుల్లో ఈ రోజు విచారణ సందర్భంగా ఏమి జరుగుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.. క-రో-నా రెండవ దశ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి విచా రణ జరు గుతుందా..లేదా.. అనే సందేహాలు న్యాయవాద వర్గాల్లో కూడా వ్యక్తమయ్యాయి.

hc 03052021 2

క-రో-నా దృష్ట్యా ఇప్పటికే ఏప్రిల్ 21వ తేదీ వరకు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపుపై దాఖలైన వ్యాజ్యాలపై ఏ రకంగా స్పందిస్తుందనే విషయమై సందేహాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప కుమార్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాజధానికేసులను ఈ రోజు విచారణ చేపట్టింది. వికేంద్రీకరణ బిల్లులపై మొదటి సారి ఈ ఏడాది మార్చి 26న విచారణ జరిపిన ధర్మాసనం మే 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని తరలింపు, సీఆరీ ఏ రద్దుకు సంబంధించి హైకోర్టులో దాదాపు వంద వరకు పిటి షన్లు దాఖలయ్యాయి. వీటిపై గత ఏడాది కొంత వరకు విచారణ జరిగింది. అయితే గత ఏడాది ఇదే పరిస్థితుల కారణంగా నిరవధిక వాయిదా పడింది. ఈ లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు, వాటిపై దాఖలైన పిటిషన్లతో రాజధాని కేసుల విచారణ వాయిదా పడింది. వికేంద్రీకరణ, సీఆర్టీ ఏ బిల్లులను వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో 500వ రోజులకు పైగా దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి వర్చువల్ వీడియో ద్వారా విచారణ జరిపేందుకు హైకోర్టు ధర్మాసనం సిద్ధం కాగా, పిటీషనర్ల విజ్ఞప్తి మేరకు, ఆగష్టు నెలకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read