ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్ట్ లో ఎదురు దెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని ఆవ భూముల్లో, ఇళ్ళ పట్టాల పై స్కాం జరిగింది అంటూ, హైకోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. 600 ఎకరాల భూమి కొనుగులులో అవినీతి జరిగింది అంటూ, హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసారు, బూరుగుపూడికి చెందిన రైతు. ఆ పిటీషన్ ఈ రోజు హైకోర్ట్ లో విచారణకు వచ్చింది. తూర్పుగోదవరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని బూరుగుపూడిలో, ఎకరం రూ.7 లక్షల 20 వేలు చేసే భూమి, ప్రభుత్వం రూ.45 లక్షలు చెల్లించింది అంటూ, ఫిర్యాదు చేసారు. ముంపు భూములు కొనుగోలు చేసి ఇళ్ళ పట్టాలకు ఇస్తున్నారని, ఆ కొనుగోలులో, ఆరు రెట్లు అధిక ధర ఇచ్చారంటూ, కోర్ట్ దృష్టికి తెచ్చారు, పిటీషన్ తరుపు న్యాయవాది, బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు. అధికారులు, నాయకులు కుమ్మక్కు అయ్యి, ప్రజాధనం వృధా చేసారని చెప్పారు. అక్కడున్న 20 అడుగులు లోతు గుంతలు పుడ్చాలంటే వందల కోట్లు, ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని, కోర్ట్ కు తెలిపారు.

అయితే దీని పై హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు, భూములు అమ్మిన రైతులకు, డబ్బు చెల్లించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ప్రభుత్వం తరుపు వాదనలను అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించారు. ఇలాంటి కేసు పై దక్షిణ ఆఫ్రికాలో జడ్జిమెంట్ ప్రస్తావించారు, అడిషనల్ ఏజీ. అయితే సుప్రీం తీర్పులే దీని పై ఉన్నప్పుడు, ఇతర దేశాల ఉదాహరణలు ఎందుకుని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. తమకు కౌంటర్ దాఖలు చెయ్యటానికి సమయం కావాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరటంతో, కేసును హైకోర్ట్ వాయిదా వేసింది. రాజమండ్రి అర్బన్, రూరల్ మండల ప్రాంతంలోని 42,742 మంది పేదలైన లబ్దిదారులకు నవరత్నాలు పేరిట ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధంచేసింది.

ఈ మేర కు సమీపంలో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లభ్యం లేకపోవడంతో రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు, కోరుకొండ మండలంలో, 177 ఎకరాల్లో ఉన్న ఈ ఆవ భూములు కొనుగోలు చేసేలా, చేసారు. అక్కడ ఎకరా, 5 నుంచి 7 లక్షలు కూడా లేని చోట, ఏకంగా 43 లక్షల నుంచి 63 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించేలా ప్రయత్నాలు చేసారు. అయితే, ప్రయివేట్ వ్యక్తుల నుండి కొనుగోలు ద్వారా సేకరించిన భూముల్లో 177 ఎకరాలు భూమి గోదావరి ప్లడ్ ఎఫెక్ట్డ్ ల్యాండ్ ప్రాంతంగా ఉందని మార్చి 9 వ తేదీన జలవనరులశాఖ సెంట్రల్ డివిజన్ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ తన పై అధికారి అయిన ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ కి ఒక లేఖ కూడా రాసారు. జలవనరులశాఖ నివేదిక ఇచ్చినా, ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అంటే, ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. దీని పై, ఇప్పుడు హైకోర్ట్ ఏమి చెప్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read