పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగాలేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎన్‌వోసీ తీసుకుని సమస్య పరిష్కరించాలని భాజపా నేత గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగా లేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్వారంటైన్‌కు వెళ్లే అవసరం లేదంటే వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది. వారిని హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోనాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసింది. మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబుతో కమిటీ ఏర్పాటు కానుంది. నిత్యం వైద్యశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సూచించారు. కరోనా నివారణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు వివరించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు.రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రివర్గం అభిప్రాయపడింది. దేశానికి, రాష్ట్రాలకూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

కరోనా నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దని సీఎం జగన్‌ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిపైనా మంత్రివర్గం చర్చించింది. వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా రాష్ట్రాలు ముందుకురాకుంటే వసతి ఖర్చు భరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. యాచకులు, అనాథలకు వసతి కల్పించాలని, కల్యాణమండపాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read