అందరూ అనుకున్నట్టే అయ్యింది. మరో సారి, పోలీసులకు, ప్రభుత్వానికి హైకోర్ట్ చేతిలో మొట్టికాయలు పాడ్డాయి. నిన్న చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వటం, పోలీసులు పర్మిషన్ ఇవ్వటంతో, చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు పర్యటనలో కేవలం 50 మంది టిడిపి నేతలే ఉండాలి అంటూ, చెప్పిన పోలీసులు, అనూహ్యంగా, వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, ఎయిర్ పోర్ట్ లోపలకి వస్తున్నా, వారిని ఆపాకుండా కూర్చున్నారు. అంతే కాదు, వారు టమాటాలు, కోడి గుడ్లు, రాళ్ళు తెస్తున్నా, పోలీసులు వారిని నిలువరించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ లోపలకు తనిఖీ చేసి పంపుతారని, అలాంటిది రాళ్ళూ, కోడిగుడ్లు లోపలకు ఎలా వచ్చాయి అంటూ టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరో పక్క, చంద్రబాబు కాన్వాయ్ కదల నివ్వకుండా, దాదపుగా నాలుగు గంటల పాటు, ఆయన్ను రోడ్డు మీద ఉండేలా చేసారు. వైసీపీ కార్యకర్తలు వీరంగం సృస్తిస్తున్నా పోలీసులు ఏమి చెయ్యలేదు.

court 2802020 2

చివరకు అయుదు గంటల తరువాత, చంద్రబాబుని అరెస్ట్ చేసారు. 151 నోటీస్ ఇచ్చి, చంద్రబాబుని అరెస్ట్ చేసారు. అయితే గొడవ చేసి, వీరంగం సృష్టించిన వైసీపీ మూకలను వదిలేసి, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం, ఆయన్ను తిప్పి హైదరాబాద్ పంపటం పై, విమర్శలు ఎదురు అయ్యాయి. పర్మిషన్ తీసుకుని వచ్చిన చంద్రబాబు, పర్యటన జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులుది అయితే, అడ్డుకుంటానికి వచ్చిన వారిని ఏమి చెయ్యకుండా, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం మరో విడ్డూరం. ఈ మొత్తం సంఘటన పై , ఈ రోజు తెలుగుదేశం పార్టీ హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై, ఈ రోజు హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో, హైకోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది.

court 2802020 3

అధికారంలో ఉన్న వారికి ఒక రూల్‌, ప్రతిపక్షంలో ఉన్న వారికి మరో రూల్‌ ఉంటుందా? చట్టం ముందు అందరూ సమానమే కదా ? అని హైకోర్టు ప్రశ్నించింది. షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది.ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా? అక్కడ ఆందోళన చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు ? వారి పై ఏ చర్యలు తీసుకున్నారు ? ఎయిర్ పోర్ట్ కు రాకుండా వారిని ఎందుకు నిలువరించలేదు ? అంటూ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. దీని పై తమకు పూర్తీ స్థాయిలో కౌంటర్‌ కావాలి అంటూ, డీజీపీ, విశాఖ సీపీని హైకోర్టు ఆదేశిస్తూ, కేసుని వచ్చే నెల 2కు వాయిదా వేసి, ఆ రోజు దీని పై తదుపరి విచారణ చేస్తామని చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read