మండలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ,శాసనమండలి పరిసరాల్లో వైఫై ,ఇంటర్ నెట్ కనెక్షన్లు ,టివిలు నిలిపివేతతో, మండల గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు, సహా టిడిపి నేతలు వచ్చారు. శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల పై చర్చ జరిగిన తరువాత, బిల్లుని సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయాలని టిడిపి పార్టీ పట్టు పట్టింది. అయితే, అది కుదరదు అంటూ, వైసీపీ మంత్రులు నినాదాలు చేసారు. వైసీపీ,టిడిపి సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసారు. టీడీపీ ఎమ్మెల్సీల వైపు దూసుకెళ్లేందుకు మంత్రి కొడాలి నాని యత్నించటంతో, కొడాలి నాని వైపు దూసుకెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు యత్నించారు. పోడియం వద్దకి చేరుకుని టీడీపీ ,వైసీపీ సభ్యుల నినాదాలు చేసారు. తీవ్ర గందరగోళం మధ్య శాసన మండలి 10 నిమిషాలు వాయిదా పడింది. అయితే అసలు బయటకు లైవ్ ఇవ్వటం లేదని, అసెంబ్లీ లాబీల్లో లైవ్ వస్తుంటే, అది కూడా ఎందుకు ఆపారని ? బలవంతంగా, ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది.

twist 22012020 1

చివరకు టివిలు కూడా ఎందుకు ఆపారు అంటూ, తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే వీళ్ళు ఏమైనా చేస్తారు అనే ఉద్దేశంతోనే, ఏకంగా చంద్రబాబు నాయుడు కూడా వెళ్లి గ్యాలరీలో కూర్చోవటంతో, వీళ్ళ కుట్రలకు బ్రేక్ పడతాయని, అంత దూకుడుగా వెళ్ళే అవకాసం లేదని, రూల్ ప్రకారమే వెళ్ళే అవకాసం ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఉదయం నుంచి బిల్లు పై చర్చ జరిగిన తరువాత, బిల్ పై వోటింగ్ జరపాలని, వైసీపీ మంత్రులు కోరారు. అయితే, ఏకంగా 20కి పైగా మంత్రులు, మండలిలో ఉండటంతో, యనమల అభ్యంతరం చెప్పారు. ఎప్పుడు అసలు మండలికి రాని మంత్రులు, ఇప్పుడు 20 మంది వచ్చారని, వారిని ఇక్కడ నుంచి పంపించాలని, వారికి ఇక్కడ ఓటు హక్కు లేదని, చర్చ అయిపొయింది కాబట్టి, వారిని పంపించేయాలని కోరారు.

twist 22012020 1

అలాగే, ఈ బిల్లుల పై మేము సవరణలు ప్రతిపాదించామని, వీటితో పాటుగా ప్రతిపక్షం కూడా అభ్యంతరం చెబుతోంది కాబట్టి దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని యనమల డిమాండ్ చేశారు. అయితే, దీని పై వైసీపీ అభ్యంతరం చెప్పింది. మీరు సవరణలు ఎప్పుడు ఇచ్చారని వైసీపీ ప్రశ్నించటంతో, ఎమ్మెల్సీ అశోక్ బాబు తనకు సవరణలు ఇచ్చినట్టు చైర్మన్ షరీఫ్ వెల్లడించారు. అయితే సవరనలు సభ ముందు పెట్టలేదని, వైసీపీ అభ్యంతరం చెప్పింది. దీని పై తెలుగుదేశం స్పందిస్తూ, నిన్న అంతా 71 మీద చర్చ జరిగిందని, నిన్న సాయంత్రం చైర్మెన్ బిల్లులు పెట్టాం అని చెప్పగానే, సవరణలు ఇచ్చామని చెప్పారు. ఎప్పుడు సవరణలు ఇచ్చినా ఏముంది, అంటూ ప్రశ్నించారు. మా డిమాండ్ సెలెక్ట్ కమిటీకి పంపించాలని, కావాలంటే సభలో వోటింగ్ పెట్టాలని కోరారు. అయితే, ఈ క్రమంలో, వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవటంతో, సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. సెలెక్ట్ కమిటీకి వెళ్తే, దాదాపుగా 3 నెలల పాటు, రాజధాని ప్రక్రియ ఆగిపోనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read