రాజధాని విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిపై రైతుల నుంచి అభ్యంత రాలు స్వీకరించే గడువును తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పెంచుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అభ్యంతరాల స్వీకరణను 17వ తేదీవరకు కొనసాగించి, 20న జరిగే కేబినెట్, అసెంబ్లీ సమావేశాలు రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం గైకొంటుం దని భావిస్తున్న తరుణంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం గత 30 రోజులుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు రైతులు ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. ఇప్పటికే రైతులు దాఖలు చేసిన పలు పిటిషన్లను పరిగణనలోకి తీసుకొన్న ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది.

crda 18012020 2

ఈ నేప థ్యంలో రాజధానిపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్ డీఏ) కోరింది. అందుకుగాను 14వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో సీఆర్ డీఏ వెబ్ సైట్లో లేదా స్వయంగా అభ్యంతరాలు తెలియ జేయవచ్చని సూచించింది. పండుగ సెలవు దినాలు కావ టం, అభ్యంతరాలు తెలిపేందుకు కేవలం మూడు రోజులే గడువు ఇవ్వటంతో ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ రాజ ధాని ప్రాంతానికి చెందిన న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్ బాబు, పారా కిషోర్లు రైతుల తరుపున ఒక రిట్, మరొక పిల్ దాఖలు చేశారు. వీటిపై వాదించేందుకు ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హైకోర్టుకు వచ్చారు.

crda 18012020 3

హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరిట్, పిల్లను లంచ్ మోషన్లో విచారణకు స్వీకరించింది. సీఆర్‌డీఏ రైతుల అభ్యంతరాలను ఏ అంశంపై అడిగింది స్పష్టం చేయలేదని, అభ్యంతరాలు కోరుతున్నట్లు ఒక ప్రకటన మాత్రమే వెలువడిందని, కేవలం మూడు రోజుల వ్యవధిలో, అభ్యంత రాలు దాఖలు చేయటం ఎలా సాధ్యం అవుతుందని, ఈ స్థితి లో గడువు పెంచాల్సిందిగా పిటీషనర్ తరపు న్యాయవాధు లు న్యాయమూర్తులను అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read