విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన కంపెనీలు లేవు. ఐటి కంపెనీలు, సరైన ఇన్ఫ్రా లేని మన రాష్ట్రం వచ్చే పరిస్థతి చాలా తక్కువ. అందుకే అప్పట్లో చంద్రబాబు, దేశ విదేశాలు తిరిగి, మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని కంపెనీలు తెచ్చే విషయంలో సక్సస్ అయ్యారు. అందులో భాగంగానే, రాష్ట్రం మొబైల్ ఫోన్ లు తయారు చేసే హబ్ అయ్యింది. అలాగే కియా, హీరో హోండా, అశోక్ ల్యేలాండ్ లాంటి ఆటోమొబైల్ కంపెనీలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారటం, చంద్రబాబు లాంటి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం లేకపోవటంతో, కొన్ని కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. అందులే ముఖ్యంగా, చైనాకు చెందిన హోలీటెక్‌ సంస్థ ఇప్పుడు మనసు మార్చుకుంది.

పోయిన సంవత్సరం ఆగష్టు 5 వ తారీఖున, ఈ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబు వద్దకు వచ్చి, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు ఒప్పందం కుదుర్చుకుని వెళ్లారు. ఫోన్ల విడిబాగాలు, ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీలో పేరొందిన ఈ సంస్థ.. రూ.1400 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో కర్మాగారం పెట్టటానికి సిద్ధమైంది. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఉన్నా సరే, ఈ కంపెనీని మన రాష్ట్రం తీసుకోవటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేస్తున్నట్టు ఒప్పదం కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడ ప్రభుత్వం మారటంతో, సీన్ మారిపోయింది. ఈ కంపెనీ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ వెళ్ళిపోయింది. దీనికి సంబంధించి ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి, ఏపి మీద అభిమానం ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read