విశాఖపట్నంలో ఎల్జీ పలైమర్స్ ఘటన మర్చిపోక ముందే, మరోసారి, విశాఖ వాసులను దట్టమైన పొగ భయపెట్టింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సీడీయూ-3 యూనిట్ ను ఈ రోజు తెరిచేందుకు, హెచ్‌పీసీఎల్‌ చర్యలు తీసుకుంటూ ఉండగా, ఒక్కసారిగా తెల్లని పొగలాగా వచ్చి, ఆ ప్రాంతం మొత్తం అలుముకున్నాయి. దీంతో ఏమి జరుగుతుందో తెలియని ప్రజలు, ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. కొంత మంది, ఇళ్ళ నుంచి బయటకు వచ్చి, భయంతో గడిపారు. అయితే, అదేమీ ప్రమాదం కాకపోవటం, కొద్ది సేపటికి ఆ పొగ తగ్గిపోవటంతో, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జరిగిన ఘటన పై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఆ పొగ ఎందుకు వచ్చింది, అది ఏమిటి అనే దాని పై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఇళ్ళ నుంచి ఈ పొగ స్పష్టంగా కనపడటంతో, కొంత సేపు స్థానికులకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ విషయంలో భయం భయంగా ఉన్న విశాఖ ప్రజలు, ఈ ఘటన చోటు చేసుకోవటంతో, జరిగిన ఘటన పై, ఒకరిని ఒకరు ఫోన్ చేసుకుని, జరిగిన ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే క్రమంగా పొగ ఆగిపోవటంతో, ప్రజలు ఆ భయం నుంచి బయటకు వచ్చారు. అయితే, తెలుస్తున్న సమాచారం ప్రకారం, కొన్ని రోజుల నుంచి కంపెనీ మూసేసి ఉండటంతో, ఈ రోజు మొదలు పెట్టటంతో, సహజంగా రియాక్షన్స్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, అది ప్రమాదకర వాయువు కాదని తెలుస్తుంది. హెచ్‌పీసీఎల్‌ దీని పై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత కాని, జరిగింది ఏమిటో క్లారిటీ వచ్చే అవకాసం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read