గత నెల రోజులుగా ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మే విషయం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినీ పరిశ్రమలో కూడా చీలిక తెచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ విషయం పై వైసీపీ పై విరుచుకు పడ్డారు. ఇది రాజకీయ దుమారం కూడా రేపింది. పవన్ కళ్యాణ్ ఒక వైపు ఉంటే, చివరకు సొంత కుటుంబంలో ఉన్న చిరంజీవి కూడా పవన్ వైపు లేకుండా, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ముఖ్యంగా ప్రభుత్వం చెప్తుంది,ఇష్టం వచ్చినట్టు టికెట్ రెట్లు వసూలు చేస్తున్నారని, కొత్త సినిమా రిలీజ్ అయితే, పండుగ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారని. మరి ఇంతలా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తుంటే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం, ఇందుకు విరుద్ధంగా ఉంది. దసరా పండుగ రోజు ఆర్టీసి వేసే స్పెషల్ బస్సుల్లో 50 శాతం పైగా చార్జీలు బాదేస్తారు అంట. అన్ని బస్సులను స్పెషల్ బస్సులుగా మార్చేస్తారు. ఇలా ప్రైవేటు బస్సులు వసూలు చేస్తే, నియంత్రించాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు ఇలా చేయటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. సినిమా టికెట్లు ఆన్లైన్ అని చెప్పి, ఇప్పుడు ఇదేమిటి అని ప్రశ్నిస్తున్నారు ? ప్రభుత్వం ఏమి చెప్పదలుచుకుంది ? అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఈ విమర్శలకు ఏమి సమాధానం చెప్తుందో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read