నేటి నుంచి మన పిలక కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నేటి నుంచి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డుల పరిధి అమల్లోకి వస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి దశలో సమ్మతి తెలిపే ప్రాజెక్టుల బాధ్యతల స్వీకరణ చేస్తారని సమాచారం. తీర్మానించిన జాబితాను తెలుగు రాష్ట్రాలకు బోర్డులు అందించాయి. 15 అవుట్ లెట్ల జాబితాను కేఆర్ఎంబీ ప్రకటించింది. శ్రీశైలం పరిధిలో 7, నాగార్జునసాగర్ కింద 8 ప్రాజెక్టులను ప్రకటించారు. 15 అవుట్ లెట్లకు ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాలు జారీ చేయాల్సి ఉంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేందుకు అంగీకారం తెలిపాయి. పెద్దవాగు కింద ఏపీలో 85 శాతం, తెలంగాణలో 15 శాతం ఆయకట్టు ఉంది. అలాగే కృష్ణాకు సంబంధించి బోర్డుకు సమ్మతిని రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా తెలపలేదు. 15 అవుట్ లెట్లకు సంబంధించి సమ్మతిని ఇరు రాష్ట్రాలు తెలపాయి. విద్యుత్ కేంద్రాలు మినహాయించి ఉత్తర్వులిచ్చేందుకు తెలంగాణ యత్నం చేస్తుంది. అయితే ఉత్తర్వుల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేచి చూస్తుంది. తెలంగాణా ప్రకటించిన తరువాత, చూద్దాం అనే ధోరణితో ఉందని సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read