ఈ రోజు ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గత వారం రోజుల్లో, దేశంలో అందరి పై చేసిన ఐటి రైడ్స్ వివరాలు ఆ ప్రెస్ నోట్ లో ఉన్నాయి. గత వారంలో విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణే నగరాల్లో, 40 చోట్ల ఐటి రైడ్స్ చేసినట్టు ఆ ప్రెస్ నోట్ లో పెర్కుంది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కడపలో తెలుగుదేశం నేత శ్రీనివాస్ రెడ్డి, అలాగే విజయవాడలో, చంద్రబాబుకి పర్సనల్ సెక్రటరీగా పని చేసిన, శ్రీనివాస్ పై, ఐటి రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. కడపలో శ్రీనివాస్ రెడ్డి, ఒక కాంట్రాక్టర్ కాబట్టి, ఆయన పై, రొటీన్ గా రైడ్స్ జరిగాయి. ఇక శ్రీనివాస్ మీద, జరిగిన ఐటి రైడ్స్ ప్రాముఖ్యత ఎందుకు వచ్చాయి అంటే, ఆయన చంద్రబాబుకి పర్సనల్ సెక్రటరీగా చేసారు కాబట్టి. అయినా, శ్రీనివాస్ ఒక అధికారి. మొన్నటి దాక చంద్రబాబు దగ్గర చేసారు, ఇప్పుడు వేరే డిపార్టుమెంటులో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇక విశాఖపట్నం, ఢిల్లీ, పూణే నగరాల్లో జరిగిన రైడ్స్ ముఖ్యంగా ఇన్ఫ్రా కంపెనీల పై జరిగాయి.

మూడు నాలుగు నెలల క్రితం, మేఘా కృష్ణా రెడ్డి పై ఎలా జరిగాయో, అలా జరిగాయి. ప్రెస్ నోట్ లో కూడా, అదే విషయం చెప్పారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన, మూడు ఇన్ఫ్రా కంపెనీల పై రైడ్స్ చేసినట్టు చెప్పారు. సోదాల్లో నకిలీ బిల్లులు, వగైరా దొరికాయని, సబ్ కాంట్రాక్టర్ ల పెరుతో అసలు వారే రిటర్న్స్ వేస్తున్నారు టాక్స్ ఎగ్గొడుతున్నారు అలా 2000 కోట్లు ఎగేసారు అని చేసిన రైడ్స్ ఇవి. ముఖ్యం గా తెలంగాణ కి చెందిన కంపెనీలు కొన్ని ఆంధ్ర తెలంగాణ లో పని చేసిన కంపెనీలు ఉన్నాయి. ఇక పొతే చంద్రబాబు మాజీ పీఎస్ పై, చేసిన ఐటి దాడులు వివరాలు ఒకే ఒక లైన్ లో రాసారు. ఆయన కూతురు పెళ్లి కోసం, తెచ్చుకున్న బంగారం, తప్ప అక్కడ ఏమి దొరకేలేదు అని సమాచారం.

వివరాలు ఇలా ఉంటే, వైసీపీ మాత్రం, ఈ మొత్తం రైడ్ లు అన్నీ, చంద్రబాబుకి లింకే పెట్టేసి, ఆనంద పడుతున్నారు. అయితే, ఇక్కడ చంద్రబాబు ప్రస్తావనే లేదు. తెలంగాణా, ఇన్ఫ్రా కంపెనీలకు, చంద్రబాబుకి ఏమి సంబంధం ఉంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం, చంద్రబాబు మాజీ పీఎస్ మీద ఐటి దాడులు చేసామని. ఇది పట్టుకుని, ఈ రెండు వేల కోట్లు చంద్రబాబు అక్రమంగా చేసినట్టు, హడావిడి చేస్తూ, తమ సొంత మీడియాలో డబ్బా కొడుతూ, తమ పిచ్చి గొర్రెలను సంతోష పెడుతున్నారని టిడిపి వాపోతుంది. ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతూ, చంద్రబాబు వెంట్రుక కూడా వెళ్ళు పీకలేరని, రాజశేఖర్ రెడ్డే ఏమి చెయ్యలేక, కూర్చున్నారని అంటున్నారు. 2018 నుంచి, 2019 వరకు కేంద్రంలోని మోడీ, అమిత్ షా, చంద్రబాబు పై ఫుల్ ఫోకస్ పెట్టారని, ఏ అవినీతి ఆధారాలు దొరక్క, జగన్ తో చేతుల కలిపి, చంద్రబాబుని దెబ్బ తీసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమి లేని విషయన్ని, ఉన్నదిగా చెప్పి సంతోష పడటం, వారి నైజం అని, వారికి ఇది కొత్తేమీ కాదని టిడిపి నేతలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read