రాష్ట్ర ప్రజాస్వామ్యప్రక్రియలో నేడు దుర్దినమని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యాంగానికిలోబడి ఏదీ జరగడంలేదని, ప్రజలందరి నోళ్లలో నానుతున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేసేప్రక్రియలో తెలుగువారి కీర్తిప్రతిష్టలను ప్రపంచానికిచాటినవ్యక్తి, మాజీ ముఖ్య మంత్రిని నిర్బంధించడంద్వారా, ముఖ్యమంత్రి తన పైశాచిక ఆనందాన్నిచాటుకున్నాడని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమల్లోఉందా లేదాఅని నేడు జగన్ తనిఖీచేశాడని, ఆప్రక్రియలో భాగంగానే సూర్యుడిపై ఉమ్మేయడాని కి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి సిగ్గులేకుండా చీకటికార్యకలాపాలు సాగిస్తుంటే, నాలుగ్గోడలమధ్యనే నక్కినక్కి బతుకుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. చంద్రబాబునాయుడి నిర్బంధా న్ని సమర్థించుకోవడానికి వారుచెబుతున్న అబద్ధాలు అన్నీఇన్నీ కావన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లాలను కున్నప్పుడే, ఆప్రాంతంలోపోలీస్ యాక్ట్ 30అమల్లోకి వస్తుందని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. చంద్రబాబు తిరుపతికి, చిత్తూరుకి వెళ్లాల్సిన పరిస్థితులు కల్పిచింది ఎవరో సజ్జలకు, పెద్దిరెడ్డికి తెలియదా అని టీడీపీనేత నిగ్గదీశారు. టీడీపీతరుపున మున్సిపల్ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిని నానారకాలుగా వేధించడం, వారిపై తప్పుడుకేసు లుపెట్టడం, నామినేషన్లు బలవంతంగా ఉపసంహరింపచేయడం వంటి చర్యలనుకట్టడి చేయడానికే చంద్రబాబునాయుడు తిరుపతికి వెళ్లడం జరిగిందన్నారు.

తిరుపతికి రోజూ వేలకొద్దీ భక్తులువస్తున్నా రని, ఊరేగింపులు, సభలు, సమావేశాల్లో వైసీపీనేతలు, ఆపార్టీ కార్యకర్తలు వేలాదిగా గుమికూడుతున్నారని, వారికెవరికీ వర్తించ ని కరోనా నిబంధనలు ప్రతిపక్షనాయకుడికే వర్తిస్తాయనడం విచి త్రంగా ఉందన్నారు. గతంలో జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సుని అడ్డుకోవడానికి వెళ్తే, ఆసందర్భంలోరాష్ట్రప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నాడు ఆయన్ని అడ్డుకోవడంజరిగిందన్నారు. ఆనాడు జరిగిన ఉ దంతంతో,నేటి చంద్రబాబునాయుడి నిర్బంధాన్ని సజ్జల, పెద్దిరెడ్డి పోల్చడం పిచ్చివాళ్లమాటల్లా ఉన్నాయన్నారు. తెలుగుదేశం మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితేలేదని, ప్రజలు వైసీపీని గెలిపిస్తున్నారని వారుచెప్పడం సిగ్గుచేటన్నారు. వైసీపీని ప్రజలు అంతబాగా ఆదరిస్తున్నప్పుడు, ఎన్నికల్లో గెలిచేసత్తా వారికున్న ప్పుడు, పోలీసులను, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని గెలవాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖను అడ్డుపెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసినవారిని భయపెట్డడం, వారిపై అక్రమకేసులు పెట్టడంవంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయనమంత్రులు గెలుపుకోసం దిగజారినప్పుడే వారిపరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో చంద్ర బాబునాయుడితో జగన్ ఆడుతున్న వికృతక్రీడ ఆయన, వైసీపీ ప్రభుత్వనాశనానికే దారితీస్తుందన్నారు.

చంద్రబాబునాయుడు అడుగుబయటపెడితేనే వైసీపీప్రభుత్వం వణికిపోతోందని, దానిలో భాగంగానే పోలీసులతో మాజీముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నార న్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని ఎన్నాళ్లు పాలిస్తారో వైసీపీవారే ఆలోచించాలన్నారు. పెద్దిరెడ్డి నోటొకొచ్చినట్లు మాట్లాడే ముందు, 28మందిఎంపీలను చేతిలోపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేదో సమాధాన చెప్పాలన్నారు. జగన్ ఢిల్లీవెళ్లిన ప్రతిసారీ ఆయనకేసులకోసం విన్నపాలు, వేడుకో ళ్లుచేసుకోవడమే సరిపోయిందని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. మెడలు వంచుతా, తొడలుకొడతా అన్న జగన్మోహన్ రెడ్డి నేడు ప్రత్యేకహో దా తీసుకురాలేక, చేవలేక, చేతగాక మూలనకూర్చున్నాడన్నారు. అటువంటి వ్యక్తి నిర్వాకాలను చూసి సిగ్గుపడకుండా, పెద్దిరెడ్డి చంద్రబాబునాయుడి పనైపోయిందనిచెప్పడం గురివిందగింజను గుర్తుచేస్తోందన్నారు. ప్రజలుమరిగేవరకు, వారిలో తిరుగుబాటు ప్రారంభమయ్యేవరకు మాత్రమే పెద్దిరెడ్డి, జగన్ రెడ్డిల చీకటి కార్యక కలాపాలు సాగుతాయన్నారు. చీకట్లో దుష్టరాజకీయాలుచేస్తున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డిలకు చంద్రబాబునాయుడి రూపంలో, టీడీపీరూపంలో భవిష్యత్ లో తగినవిధంగా కోలుకోలేని దెబ్బ తగిలితీరుతుందని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. వడ్డీతో సహా, జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వంలోని వారు తగిన మూల్యం చెల్లించుకొ ని తీరుతారన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read