జ‌గ‌న్ రెడ్డి పాద‌యాత్ర చేస్తున్న‌ప్పుడు వైసీపీ కార్య‌క‌ర్త‌లు త‌మ‌కి ఏం న్యాయం చేస్తార‌ని అడిగితే, మ‌న ప్లేట్లో మ‌న‌మే బిర్యానీ వ‌డ్డించుకుని తిందాం అని నిర్భ‌యంగా చెప్పారు. జ‌గ‌న్ అన్న‌ట్టే సీఎం అయ్యాక‌ ఏపీలో వ‌న‌రులు, ప్ర‌జాధ‌నాన్ని బిర్యానీ తిన్న‌ట్టు తినేస్తున్నారు. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశాక, తాను నెల‌కి రూపాయి జీతం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. కానీ ప్ర‌జాధ‌నం మాత్రం అడ్డంగా రోజుకి కోట్లు దోచుకుంటున్నార‌ని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. చంద్ర‌బాబు తాగే హిమాల‌య వాట‌ర్ లీట‌ర్ రూ.60 పై ఏడ్చిన జ‌గ‌న్ రెడ్డి తాగే ఆవ ఆల్క‌లైన్‌ వాటర్ అక్షరాల రూ.1,012. జ‌గ‌న్ రెడ్డి వేసుకునే చెప్పుల ఖ‌రీదు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పెత్తందార్ల‌తో త‌న‌లాంటి పేద‌వాడు యుద్ధం చేస్తున్నాడ‌ని జ‌నం ముందు చెబుతున్న జ‌గ‌న్ వేసుకునే చెప్పులు బెర్లూటీ అక్ష‌రాలా 1,34,000. జ‌గ‌న్ రెడ్డి తాగే నీరు, వేసే చెప్పులు, వాడే డ్రెస్సులు ల‌క్ష‌ల్లో ఉంటే తాను పేద‌వాడిన‌ని క‌ల‌ర్ ఇవ్వ‌డం పెద్ద జోక్ అంటున్నాయి విప‌క్షాలు. వంద‌ల ఎక‌రాల్లో ఆరుకి పైగా ప్యాలెస్లు ఉన్న జ‌గ‌న్, ఒక్క సీబీఐ చార్జిషీట్ల ప్ర‌కారం 42 వేల కోట్లు దోచేసిన జ‌గ‌న్ రెడ్డి పేద‌వాడంటే వైసీపీ వాళ్లే న‌వ్వుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read