జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఫ్లైట్ టెక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే, ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ వెంటనే మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేసింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం రావటంతో, ఫ్లైట్ మళ్ళీ వెనక్కు వచ్చేసింది. గాల్లో చక్కర్లు కొట్టి, కొద్ది సేపటికి కిందకు దిగేసింది. అయితే అప్పటికే జగన్ కాన్వాయ్ తిరిగి వెళ్ళిపోయింది. జగన్ ఫ్లైట్ తిరిగి రావటంతో, సెక్యూరిటీకి ఒక్కసారి అర్ధం కాలేదు. మళ్ళీ జగన్ కాన్వాయ్ తిరిగి వచ్చింది. జగన్ మళ్ళీ తిరిగి తాడేపల్లి వెళ్లిపోయారని చెప్తున్నారు. మరి మళ్ళీ ఢిల్లీ వెళ్తారో లేక, ఢిల్లీ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read