జగన్ మోహన్ రెడ్డి రేపు ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. రేపు ప్రధాని మోడీతో పాటు, పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళిన తరువాత హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి ర్మలా సీతారామన్ తో, ఆరోగ్య శాఖా మత్న్రి హర్షవర్థన్‌ తో భేటీ అవుతారని తెలుస్తుంది. అలాగే ప్రధాని మోడీతో కూడా భేటీ అవుతారని సమాచారం. అయితే అపాయింట్మెంట్ విషయంలో ఎలాంటి సమాచారం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రధాన కారణం, రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం అని వైసిపీ చెప్తుంది. రాష్ట్రానికి అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయని, రాష్ట్రానికి నిధులు సరిగ్గా రావటం లేదని, అలాగే ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ప్రత్యెక హోదా సహా అనేక పెండింగ్ అంశాల పై చర్చిస్తారని వైసిపీ చెప్తుంది. అయితే ఇంత ఆకస్మికంగా జగన్ ఢిల్లీ వెళ్ళటం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అనే విషయం కూడా చర్చకు దారి తీస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read