చివరి క్షణంలో, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. చివరి క్షణంలో, అంటే, మొత్తం ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్న వేళ, ఇది జరిగింది. తాడేపల్లి ఇంటి నుంచి, గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు, ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి, జగన్ కాన్వాయ్ కోసం ఎదురు చూస్తున్న వేళ, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది అనే వార్త వచ్చింది. దీంతో అసలు ఎందుకు వాయిదా వేసుకున్నారు. ఏమి జరిగింది, అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. చివరి నిమిషంలో, ఎందుకు రద్దు అయ్యింది అనే విషయం పై, ప్రభుత్వం ఏమి చెప్తుందో చూడాలి. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, అమిత్ షా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చిన తరువాత, జగన్ వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ వివరించి, రాజకీయ పరమైన అంశాలు అయితే, జగన్ తో అపాయింట్మెంట్ వద్దు అని అమిత్ షా పై ఒత్తిడి తెచ్చినట్టు కూడా సమాచారం.

జగన్ ఈనెల రోజు ఢిల్లీ వెళ్తారని, నిన్న వార్తలు వచ్చాయి. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల తరువాత తొలి సారిగా జగన్మోహనరెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారని చెప్పారు. రాష్ట్రానికి సంబంధజంచిన వలు అంశాలతో పాటు జగన్ అమిత్ షాతో చర్చించిస్తారని చెప్పారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా జగన్ అమిత్ షాను కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి సవివవరంగా, రెండు లేఖలు రాసారు. కౌనిల్స్ రద్దు అంశంతో పాటు పాటు ఎస్ఈసీ వ్యవహారం కుడా ఇరువురి మధ్యా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతోను ముఖ్యమంత్రి బేటీ కానున్నట్లు చెప్పారు. అయితే, ఇప్పుడు పర్యటన వాయిదా పడటంతో, మళ్ళీ ఢిల్లీ ఎప్పుడు వెళ్తారో తెలియాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read