ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కే ముఖ్య‌మంత్రి మొగ్గుచూపుతున్నార‌ని అనుకూల‌, ప్ర‌తికూల మీడియా కోడై కూస్తోంది. సీఎం నిర్ణ‌యాలు కూడా ఆ దిశ‌గానే తీసుకోవ‌డం చ‌ర్చ‌లు ముంద‌స్తు చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రాంతాల‌కు అతీతంగా, కుల‌మ‌తాల ప్ర‌స్తావ‌న లేకుండా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై పీక‌ల్లోతు కోపంతో ఉన్నారు. ఏ తాయిలాలు ప‌నిచేసేలా లేవు. ముంద‌స్తు వ‌చ్చినా, షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రిగినా వైసీపీ దారుణ ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని ఆ పార్టీలో సీనియ‌ర్ల‌కి తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్యం. ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్ర‌త‌కి సంకేతంగా పోల్ మేనేజ్మెంట్, డ‌బ్బు పంపిణీ, దొంగ ఓట‌ర్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీని కాపాడ‌లేక‌పోయాయి. ఈ స్థాయి జ‌నాగ్ర‌హంలో ఇప్పుడు ఎన్నిక‌ల‌కి వెళ్లినా, షెడ్యూల్ ప్ర‌కారం వెళ్లినా ఓట‌మి త‌ప్ప‌న‌ప్పుడు ముందుగా ఎందుకు అధికారాన్ని వ‌దులుకోవాల‌నే ఆలోచ‌న వైసీపీ పెద్ద‌ల్లో మొద‌లైంది. సాధ్య‌మైనంత వ‌ర‌కూ అధికారం అనుభ‌వించి, అనుయాయుల‌కి మేలు చేకూర్చే అవ‌కాశం వ‌దులుకోవ‌డం ఎందుకు అనే ప్ర‌తిపాద‌న‌కే అంద‌రూ ఓకే అన‌డంతో ఇక ముంద‌స్తుకి వెళ్లే ఆలోచ‌న‌ని విర‌మించుకున్నార‌ని స‌మాచారం. దీనిని ధ్రువీక‌రిస్తూ ఇటీవ‌లే కేబినెట్‌లో ప‌వ‌ర్ ఫుల్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జ‌రుగుతాయ‌ని పెద్దిరెడ్డి చెప్ప‌డంతో ముంద‌స్తుకి వెళ్లే విష‌యంలో జ‌గ‌న్ రెడ్డి వెన‌క‌డుగు వేశార‌ని తేలిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read