రాష్ట్రంలో రెండో దశ క-రో-నా విలయతాండవం చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తుంటే, ప్రజలు వారి చా-వు వారు ఛస్తారులే నాకేంపట్టిందన్నట్లుగా అభినవ నీరోచక్రవర్తి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు కూనరవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! క-రో-నా-ను నిర్లక్ష్యం చేసి, దాన్ని చాలా తేలిగ్గా చూసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అభివృద్ధిలో వెనుకబడిన అనేక రాష్ట్రాలు, క-రో-నా కారణంగా చితికిపోయిన పేదల కుటుంబాలకు సాయం అందించడానికి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి హోల్ సేల్ అవినీతికి తెరలేపాడు. ఇసుక, మద్యం, మట్టి, మైనింగ్ వంటివాటిని కూడా తన అవినీతికి ఉపయోగించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయితే, ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తి చూపారని, కానీఇప్పుడు ప్రతిఒక్కరికీ వాస్తవాలు అర్థమవుతున్నాయి. క-రో-నా-తో రాష్ట్రంలో ఇప్పటికే 11,700మంది వరకు చ-ని-పో-యా-రు. ఆ లెక్కలన్నీ ప్రభుత్వం చెప్పిన కాకిలెక్కలు, 14-05-2021న శ్రీకాకుళం జిల్లాలో 6గురు చనిపోయినట్టు, ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంలో, అదే రోజున 32 మంది చనిపోయారు. వారిపేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. అదే జిల్లాలో వేర్వేరు రోజుల్లో కూడా మరణాల్లో తప్పుడు సమాచారమిచ్చారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు చనిపోయారు. కానీ మ-ర-ణా-ల-ను ప్రభుత్వం తగ్గించి చూపుతోంది. 17లక్షల 80వేల మంది వరకు కోవిడ్ బారిన పడ్డారని చెబుతున్నారని, కానీ వాస్తవంలో ఆసంఖ్య కంటే పదింతలు ఎక్కువగా బాధితలు ఉంటారు. పేదలకు క-రో-నా వస్తే సరైన మందులు, వైద్యం కూడా అందడంలేదు. వ్యాక్సిన్లు కూడా సమర్థంగా అందించలేని దుస్థితిలో ఈప్రభుత్వం ఉంది. క-రో-నా వేళ అనే కరాష్ట్రాలు పేదలకు ఉదారంగా సాయం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దాష్టీకంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తొలిదశ క-రో-నా వచ్చినప్పుడే పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దాని ప్రభావమే ప్రజలు ఎక్కువగా క-రో-నా బారినపడటం. తెలంగాణ సీఎం కేసీఆర్ 70ఏళ్లవయస్సులో కూడా ఆసుపత్రులు సందర్శించి, ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. మమతాబెనర్జీ, స్టాలిన్ వంటివారు ప్రజలముందుకు వెళ్లి, వారికి ధైర్యం చెబుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికలైన మరుక్షణమే పేదల కోసం ప్రత్యేకంగా రూ.20వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. 16రకాల నిత్యావసరాలను ప్రతికుటుంబానికి అందించడానికి సిద్ధమయ్యారు.

ఆపత్కాల సమయంలో రాష్ట్రంలోని కోటి కుటుంబాలు ఉపాధికోల్పోయి అలమటిస్తుంటే, వారికి సాయం చేయడానికి కూడా ప్రభుత్వానికి మనస్సు రావడం లేదు. ధరలు పెంచడం, పన్నుల రూపంలో ఆఖరికి ప్రజలపై కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభు త్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని తామే ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నీటిపన్ను, జుట్టుపన్ను, ఆస్తిపన్ను, చెత్తపన్నుతో జగన్మోహన్ రెడ్డి అభినవ తుగ్లక్ గా కూడా మారాడు.రాష్ట్ర ఖజానా నుంచి రూపాయికూడా ఈప్రభుత్వం పేదలకు అందించలేదు. చట్టా న్నినమ్మను, రాజ్యాంగాన్ని గౌరవించను, వ్యవస్థలను లెక్క చేయను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ , ఒడిశా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సహా, అనేకరాష్ట్రాలు ఆటోడ్రైవర్లకు, ఉపాధికోల్పోయిన ఇతరవర్గాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఢిల్లీప్రభుత్వం దాదాపు 70లక్షల కుటుంబాలకుఉచితంగా సరుకులు అందిస్తోంది. ఏపీలో మాత్రం ఎక్కడా ఉచితంగా సరుకులుగానీ, భోజనం కానీ అందించిందిలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ - డీజిల్ ధరలపై అసెంబ్లీలో గొంతుచించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడెందుకు రూ.100 దాటినా నోరెత్తడంలేదు. ఈ ముఖ్యమంత్రికి నిజంగా మనస్సుంటే, మానవత్వముంటే, తక్షణమే పేదకుటుంబాల కు ఆర్థికప్యాకేజీప్రకటించాలి. పెట్రోల్ – డీజిల్ ధరలతోపాటు, పెంచినపన్నులు తీసేయాలి. పథకాలపేరుతో ప్రజల్ని దోచుకుంటున్న ముఖ్య మంత్రి, కోవిడ్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం చేయలేరా? ప్రజలంతా ఇప్పటికైనా చైతన్యవంతులవ్వాలి. తమనుంచి వసూలు చేస్తున్న సొమ్మంతా ఏం చేస్తున్నారని జనమంతా అధికార పార్టీ వారిని నిలదీయాలి. కో-వి-డ్ కారణంగా అనాథలైన కుటుంబాలను ఆదుకోమని కోరితే ప్రతిపక్షనేతలపై కేసులు పెడతారా? ఎన్ని అక్రమ కేసులుపెట్టినా టీడీపీ నేతలు ప్రజలపక్షాన మాట్లాడుతూనే ఉంటారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఉపాధికోల్పోయిన కుటుంబాలకు తక్షణమే రూ.10వేల ఆర్థికసాయం ప్రభుత్వం అందించాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read