మాట తప్పను, మడమ తిప్పను. ఇది జగన్ చెప్పే మాట. అలాగే నా మ్యనిఫెసో ఖురాన్, బైబుల్, భగవత్ గీత.. ఇలాంటి మాటలు చెప్పి, ప్రజలను నమ్మించి , జగన్ మోహన్ రెడ్డి మోసం చేసారు. పాదయాత్రలో డైరీలకు డైరీలు రాసి హామీలు ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, కేవలం ఒక కాగితమే తన మ్యానిఫెస్టో అని జగన్ చెప్తున్నారు. పోనీ ఆ ఒక పేజీ మ్యానిఫెస్టో అయినా జగన్ చేస్తున్నారా అంటే, అది కూడా మోసమే. ఇలాంటి ఒక అతి పెద్ద మోసం, ఇప్పుడు బయట పడింది. అది చూసి ప్రజలు కూడా జగన్ ఇంతటి మోసగాడా అని అనుకునే స్థాయి వరకు వెళ్ళింది. మద్య నిషేధం అని నవరత్నాలలో ఒక రాత్నంగా పెట్టిన జగన్, ఆ రత్నాన్ని నకిలీ రత్నం చేసి పడేసారు. మద్య నిషేధం కాదు, మా లిక్కర్ ఆదాయం డబుల్ అయ్యిందని చెప్పి, ఆ ఆదాయం చూపించి, ఏకంగా రూ.8 వేల కోట్ల అప్పు తెచ్చుకున్నారు. మద్య నిషేధం, మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి, ఆడ వాళ్ళను మోసం చేసి, మా రాష్ట్రంలో మేము మద్యం బాగా అమ్ముతాం, ఆ ఆదాయం చూసి, డబ్బులు ఇవ్వండి అంటూ, ఏకంగా రూ.8 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read