మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి. ప్రతిపక్షం అయినా, అధికార పక్షం అయినా. కాని మన దగ్గర వాతవరణం వేరు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం, ఏ పని చేసినా, జగన్ పార్టీ ఎగతాళి చేసేది. దోమల పై దండయాత్ర అంటే నవ్వారు. దోమల నివారణకు, మురికి కాలవల దగ్గరికి, కాలువల దగ్గరికి వెళ్ళలేని చోట, డ్రోన్ ల సహాయంతో, దోమల మందు చల్లుతాం అంటే, వెటకారం చేసారు. అలాగే వైజాగ్ లో, అని వైద్య పరికరాలు తయారు చేసే, మెడ్ టెక్ జోన్ పెడతాం అంటే ఎగతాళి చేసారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అది మంచి పని అయినా, రాజకీయం కోసం, అప్పట్లో అలా చేసి ఉండొచ్చు. కాని, జగన్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఆయన తరుచూ చెప్పే దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు ఆయనకు వర్తిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు కరోనా వ్యాప్తి అరికట్టటానికి, డ్రోన్ల సహయం తీసుకుని, డ్రోన్లతో మందు కొడుతున్నారు. అలాగే ఏ మెడ్ టెక్ జోన్ అయితే మయసభ అన్నారో, ఇప్పుడు అక్కడే, యుద్ధ ప్రాతిపదికిన, మాస్కులు, వెంటిలేటర్లు తయారు చెయ్యమని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఏమి తప్పు లేదు. ఇలాంటి సమయాల్లో, టెక్నాలజీ ఉపయోగించాలి.

కాని, అనవసరంగా రాజకీయ విమర్శలు చేస్తే, ఆ దేవుడి స్క్రిప్ట్ మన మీదే రివర్స్ అవుతుంది. ఇక ప్రసుత్తం జగన్ గారి ప్రభుత్వం, డ్రోన్ల సహాయంతో, కరోనా పై ఎలా పోరాడుతుందో చూద్దాం. డ్రోన్ల టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ పై సమరానికి వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కరోనా మహమ్మారి పై డ్రోన్లతో యుద్ధం ప్రారంభించాయి. సాధారణంగా నిఘా కోసం ఉపయోగించే డ్రోన్లను ఇప్పుడు రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా వైరసను కట్టడికి వినియోగించడం మొదలు పెట్టాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా రసాయనాలు స్ప్రే చేస్తున్నాయి. రసాయనాలను స్ప్రే చేస్తున్నట్లు స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

వీటి కోసం అధికారులు అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. వాటి ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మాన్కులు, బాడీ సూట్స్ వేసుకుని పారిశుధ్య సిబ్బంది రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. అయితే వీరు ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా కరోనా వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. ఈవిధంగా ఇప్పటికే పలు దేశాల్లో పారిశుధ్య కార్మికులకు కరోనా వైరస్ సోకుతోంది. ఇందు కోసం కరోనా ప్రభావిత ప్రాంతాలను డ్రోన్ల ద్వారా శుద్ధి చేయడం ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు గుర్తించాయి. ఒక వ్యక్తి చేసే పనికి 50 రెట్ల పనిని ఈ డ్రోన్లు చేయగలుగుతాయి. 20 కిలో మీటర్ల ప్రాంతంలో ఒక రోజులో చేసే వీలుంటుంది. నిఘా కెమెరాలను పెట్టి ఎక్కువ జన సమూహం ఉన్న ప్రాంతాల్లో స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేయనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read