వాట్సాప్‌, ఈ రోజుల్లో అందరి చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ లో, కచ్చితంగా ఉండే యాప్. పేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టా, యూట్యూబ్ లాంటివి లేకపోయినా, వాట్సాప్‌ మాత్రం అందరి వద్దా ఉంటుంది. పల్లెటూరుల్లో కూడా, ప్రతి ఒక్కరి ఇది వాడుతూ ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా దీన్ని వాడుతూ ఉంటాయి కానీ, చాలా పరిమితంగా వాడతాయి. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన ప్లాన్ వచ్చింది. వాట్సాప్‌ తో ఒప్పందం చేసుకుని, తమ ప్రభుత్వ సంక్షేమ పధకాలు, మరింతగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలని ప్లాన్ వేసి, వాట్సాప్‌ తో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరి ఫోన్ కైనా, జగన్ ఏ మెసేజ్ అయినా, వీడియో అయినా, పంపించవచ్చు. ఒకేసారి కోటి మందికి అయినా పంపించే వీలు ఉంటుంది. అయితే ఈ ఒప్పందం పై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తున్నాయి. దీని వెనుక కుట్ర ఉందని, ప్రభుత్వం పేరుతో రాజకీయ ప్రచారం చేసుకుంటారని, ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల్లో కూడా ప్రతిపక్షాలను, మీడియాను తిడుతూ ఇస్తున్న ప్రకటనలు గుర్తు చేస్తున్నారు. తమ పార్టీ లాభం కోసం వాట్సాప్‌ వాడే కుట్ర జగన్ మోహన్ రెడ్డి పన్నారని, దీని పై న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read