ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళాల్సి ఉండగా, పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి, గన్నవరం వెళ్ళటానికి, ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యారు, ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి పెట్టారు, అయితే, లాస్ట్ మినిట్ లో, ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చెయ్యటంతో, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. అమిత్ షాతో, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి భేటీ కావాల్సి ఉంది. ఈ రోజు రాత్రికి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే తుఫాను నేపధ్యంలో, అమిత్ షా బిజీ గా ఉంటారని, అందుకే అపాయింట్మెంట్ రద్దు అయ్యిందని, త్వరలోనీ మళ్ళీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి, పిలుస్తామని, హోం శాఖ వర్గాలు చెప్పాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం, ఈ పరిణామంతో ఊపిరి పీల్చుకున్నారు. జగన్ ఢిల్లీ వెళ్ళిన తరువాత, ఈ విషయం తెలిసి ఉంటే, పరువు పోయేది అని, ఇప్పటికే రెండు సార్లు, జగన్ ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలవకుండా, వెనక్కు తిరిగి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అలా జరిగితే, ప్రతిపక్షాలు గోల చేసేవి అని, ముందే తెలిసి మంచి పని అయ్యింది అని వైసీపీ భావిస్తుంది.

మరో పక్క, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దు అయిన వెంటనే, ఆయన తన నివాసంలో, విజయసాయి రెడ్డి, మంత్రి కొడాలి నాని, అలాగే మరో మంత్రి బాలినేనితో జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో ఉన్న తన క్యాంప్ ఆఫీస్ లో జగన్ వారితో భేటీ అయ్యారు. ఢిల్లీ టూర్ రద్దు అవ్వగానే, జగన్ వారితో భేటీ కావటం, ఆసక్తిగా మారింది. గంటకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. వరుసుగా రాష్ట్ర ప్రభుత్వానికీ తగులుతున్న ఎదురు దెబ్బలు, డాక్టర్ సుధాకర్ కేసు, ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ కేసు, అలాగే రంగులు కేసు పై సుప్రీం కోర్టుకు వెళ్ళటం, అన్ని వైపుల నుంచి వస్తున్న ఇబ్బందులు, ప్రతిపక్షలాకు గట్టిగా బదులు ఇవ్వటం, వంటి అంశాల పి చర్చిస్తున్నారని, ఈ భేటీ అనంతరం, కీలకమైన ప్రెస్ మీట్ కూడా, కొడాలి నాని కాని, విజయసాయి రెడ్డి కాని అడ్డ్రెస్ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read