ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం, పోలవరం విషయం పై చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యెక హోదా వదులుకున్నారు. ఇక విభజన చట్టంలో పెట్టిన హామీలు, ఎప్పటికి అవుతాయో తెలియదు. అవి కూడా సాగదీస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర విభాజన తరువాత, రెండు కళ్ళలో ఒకటి అనుకున్న అమరావతి రాజధానిని, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంపేస్తుంది. ఇక ఏపి ప్రజలకు మిగిలింది ఏమైనా ఉంది అంటే అది పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. ఇప్పటి ప్రభుత్వం కలలు కంటున్నట్టు, రేపు విశాఖ రాజధాని అయినా, అక్కడ నీళ్ళు కావాలి అంటే, మనకు కావాల్సింది నీళ్ళు. అవి పోలవరం పూర్తయితేనే వస్తాయి. విశాఖ నుంచి రాయలసీమ వరకు, ప్రతి జిల్లా నీళ్ళతో కలకలలాడే ప్రాజెక్ట్ ఇది. అందుకే గత ప్రభుత్వం, పట్టు బట్టి 71 శాతం పనులు పూర్తి చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత, రివర్స్ టెండరింగ్ పేరుతో ఆలస్యం అవ్వగా, తరువాత పనులు మందగించాయి. పనులు వేగం నెమ్మదిగా ఉంది. అయితే ఇప్పటి ప్రభుత్వం, 2021కి పోలవరం పూర్తి చేస్తాం అని బల్ల గుద్ది చెప్తుంది. అయితే సరిగ్గా ఇక్కడే కేంద్రం నుంచి వస్తున్న వార్తలు చూసి అందరూ షాక్ అయ్యారు. 2013-14 రివైజేడ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ప్రకారం, రూ.57,940 కోట్లు అప్రూవ్ చేయాలని, జూన్ 2018లో, చంద్రబాబు ఆపాటి కేంద్రం జల శక్తి మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసారు. తరువాత కేంద్రంతో రాష్ట్రం సఖ్యతగా లేకపోయినా, రాజకీయం విబేధాలు వచ్చినా, 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ, సిడబ్ల్యుసి కూడా 55,548 కోట్లకు అంగీకారం తెలిపేలా సక్సెస్ అయ్యారు.

ఇక తరువాత కేంద్ర ఆర్ధిక శాఖ అప్రూవ్ చేయటమే మిగిలింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీతో సంబంధాలు ఉండటంతో, ఇది చాలా చిన్న విషయం అని, ఆర్ధిక శాఖ ఆమోదిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం బాంబు పేల్చింది. పునరావాసం మాకు సంబంధం లేదని చెప్పింది. 25 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో, గతంలో విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు 16 వేల కోట్లు ఉన్న ప్రాజెక్ట్ ని, 56 వేల కోట్లకు పెంచి అవినీతి చేసారు అంటూ, జగన్ పాదయాత్రలో ఊరు ఊరు తిరిగి చెప్పిన వీడియోలు వైరల్ అయ్యాయి. అంటే జగన్ ఉద్దేశం 16 వేల కోట్లతో పోలవరం కట్టమని, కేంద్రానికి చెప్పటమా ? అందుకే కేంద్రం అంతే ఇస్తాను అంటుంది, అంటూ సోషల్ మీడియాలో కామెంట్ లు వస్తున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ , రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా అంటూ జగన్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇక విజయసాయి రెడ్డి, గతంలో 55 వేల కోట్లు కేంద్రం ఒప్పుకుందని, అది మా ఘనతే అంటూ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. కేంద్రం ఒప్పుకుంటే మీ ఘనత, ఒప్పుకోకపోతే, చంద్రబాబు మీద తోసేస్తారా అంటూ, ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి, గతంలో రాజకీయాల కోసం, జగన్, విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు వారికే బూమరాంగ్ అయ్యాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read