తెలుగుదేశం పార్టీ చేసిన ఆందోళనతో, తన సొంత పేపర్ తప్పు చేసింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాట తప్పి, మడం తిప్పి, చివరకు తన సొంత పేపర్ పైనే తప్పు నేట్టేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇంతకీ ఏమి జరిగింది అంటే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీలో సన్నబియ్యం పై ప్రశ్న అడిగింది. ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తాం అని చెప్పి, ఇప్పుడు నాణ్యమైన బియ్యం ఇస్తాం అంటుంది, ఇది కరెక్ట్ ఏనా అంటూ, ప్రశ్న వేసారు. దీనికి పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ప్రభుత్వం ఎక్కడా సన్నబియ్యం అని చెప్పలేదని, మేము నాణ్యమైన బియ్యం మాత్రమే ఇస్తామని చెప్పమని, సమాధానం చెప్పారు. దీని పై అచ్చెంనాయుడు మాట్లాడుతూ, సన్న బియ్యం ఇస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వీడియో మా దగ్గర ఉందని, అది అసెంబ్లీలో ప్లే చెయ్యాలని స్పీకర్ ని కోరారు. అయితే స్పీకర్ మాత్రం, ఆ విషయంలో ఏమి మాట్లాడటలేదు.

jagan 10122019 2

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక చోట్ల తిరిగి, సన్న బియ్యం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు మాట మారుస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అలాగే జూన్ నెలలో చేసిన రివ్యూ లో కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారని చెప్పారు. దానికి సంబంధించి సాక్షిలో వచ్చిన ఒక వార్తా చూపిస్తూ, సాక్షిలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారని, ఇది మీ గజెట్ ఏ కదా అని చెప్పారు. దీనికి సమాధానం ఏమి చెప్తారు అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన జగన్ మోహన్ రెడ్డి, అసలు సన్న బియ్యం అని నేను ఎక్కడా చెప్పలేదని, అసలు సన్న బియ్యం అనే మాటే ఎక్కడా లేదని, కావాలంటే తెలిసిన వారి దగ్గర నాలెడ్జ్ పెంచుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు.

jagan 10122019 3

అంతే కాదు, తాను రెండు నెలల క్రితం మాట్లాడిన వీడియో ప్లే చేసారు. తెలుగుదేశం పార్టీ పాదయాత్రలో ఇచ్చిన దాని గురించి అడుగుతుంటే, జగన్ మాత్రం రెండు నెలలు క్రితం మాట్లాడిన దాని పై వీడియో చూపించారు. అయితే టిడిపి మా వీడియో కూడా ప్లే చెయ్యండి అంటే మాత్రం చెయ్యలేదు. ఈ సమయంలో సాక్షి గురించి చెప్తూ, సాక్షి వారికి కూడా సన్న బియ్యం, నాణ్యమైన బియ్యం గురించి తేడా తెలియదు అని, సాక్షి తప్పుగా రాసింది అంటూ, తన సొంత పత్రిక పైనే జగన్ మోహన్ రెడ్డి తప్పు నెట్టేశారు. అయితే తెలుగుదేశం పార్టీ, అలాగే అయితే తప్పుడు రాతాలు రాసినందుకు, జీవో 2430 ద్వారా, సాక్షి పై కేసు పెట్టండి అంటూ, వ్యాఖ్యానించింది. మొత్తానికి, జగన్ చేతే, సాక్షిలో తప్పు రాతలు రాసారు అని తెలుగుదేశం పార్టీ చెప్పించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read