జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు, అంటే బుధవారం ఢిల్లీ టూర్ ప్లాన్ చేసారు జగన్. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోడీని, కేంద్రం హోం మంత్రి అమిత్ షాని కలుస్తారని, సమాచారం. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అవుతారని తెలుస్తుంది. అలాగే రేపు కాని, గురువారం ఉదయం కాని, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, గత మూడు సార్లుగా, జగన్ ఢిల్లీ వెళ్ళటం, అపాయింట్మెంట్ లేక తిరిగి రావటం జరుగుతూ వస్తున్నాయి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం, గత మూడు సార్లుగా, జగన్ పడరాని పాట్లు పడి, చివరకు తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ఒక్కసారి మాత్రం, ఆయన పుట్టిన రోజు అని వెళ్లి విష్ చేసారు కాని, ఎలాంటి అపాయింట్మెంట్ దొరకలేదు. ఇక హోం మంత్రి అమిత్ షా నే, అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో, కేంద్ర మంత్రులు కూడా, ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు సార్లుగా జగన్ ఢిల్లీ టూర్ ఫ్లాప్ అవుతూ వస్తుంది.

ఢిల్లీలో వ్యవహారాలు చూసే విజయసాయి రెడ్డి, ఈ విషయంలో ఘోరంగా విఫలం అవుతూ వస్తున్నారు. కనీసం ఒక సిఎంకు, మూడు సార్లుగా అపాయింట్మెంట్ ఇప్పించలేని పరిస్థితి. మరి ఈ సారి అయినా, జగన్ మోహన్ రెడ్డికి, అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో చూడాల్సి ఉంది. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో అయితే, అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందని, జగన్ మోహన్ రెడ్డి రేపు సాయంత్రం ప్రధాని మోడీని కలుస్తారని సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై, జగన్ మోహన్ రెడ్డి, కేంద్రంలోని పెద్దలకు చెప్పి, వాళ్ళను ఒప్పించే విషయమై లాబయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో అదే పని చేస్తున్న విజయసాయి రెడ్డికి, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తోడు అవుతున్నారు.

ముఖ్యంగా మూడు ముక్కల రాజధాని అంశం పై, కేంద్ర పెద్దల నుంచి, అనుకూలంగా నిర్ణయం రాబట్టే ప్రయత్నం చెయ్యనున్నారు. అలాగే, అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ వేసిన దెబ్బతో, మండలిని కూడా రద్దు చెయ్యాల్సిన పరిస్థితి రావటంతో, ఆ బిల్ ఇప్పుడు కేంద్రం చేతిలో ఉండటంతో, ఎలాగైనా, శాసనమండలి రద్దు బిల్లుని ఉభయసభల్లో పాస్ చెయ్యాలని, జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర పెద్దలను కోరనున్నారు. ఈ రెండు అంశాలు, కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉండటంతో, ఇవన్నీ అమిత్ షా కి చెప్పాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అయితే, మరి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. ఇక మరో అంశం అయిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై, ఎలాగైనా తెలుగుదేశం నేతల పై, ముఖ్యంగా చంద్రబాబు పై, సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలని జగన్ భావిస్తున్నారు. ఈ విషయం కూడా రేపు ప్రస్తావించే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read