ఈ రోజు బ్లూ మీడియాలో ఒక కధనం వచ్చింది అంటూ టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ కధనం ప్రకారం, తిరుపతిలో ప్రచారం చేస్తున్న టిడిపి శిబిరంలో కలకలం రేగింది అని, టిడిపి తరుపున ప్రచారం చేయటానికి వచ్చిన వారిలో చాలా మందికి, క-రో-నా పోజిటివ్ వచ్చింది అంటూ కధనం ప్రచారం పెట్టారు. క-రో-నా వచ్చిన వారిలో, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఉన్నారని, అలాగే మాజీ మంత్రి జవహర్ ఉన్నారని, అలాగే మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలు కూడా ఉన్నారని, వీరి అందరికీ క-రో-నా వచ్చింది, దీంతో టిడిపి నేతలు అందరూ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటూ, బ్లూ మీడియా ప్రసారం చేసిందని, టిడిపి నేతలు వాపోతున్నారు. అయితే వీరిలో అనిత, సంధ్యారాణి చంద్రబాబుని కలిసారని, చంద్రబాబుతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారని, వీరికి వెంటనే క-రో-నా వచ్చింది అని, దీంతో టిడిపి నేతలు, కార్యకర్తలు భయపడి పోతున్నారు అంటూ, బ్లూ మీడియాలో కధనాలు వచ్చాయని, ఎవరిని భయ పెట్టటానికి, ఇలాంటి కధనాలు వేస్తున్నారు అంటూ టిడిపి నేతలు మండి పడ్డారు. ఇలా అనుకుంటే విజయసాయి రెడ్డి లాంటి నేతలకు, అనేక మంది మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా క-రో-నా వచ్చింది, సాక్షాత్తు తిరుపతి ఉప ఎన్నికే, వైసీపీ ఎంపీ క-రో-నాతో చనిపోవటం వల్ల వచ్చిందని వాపోతున్నారు.

jawahar 10042021 2

అయితే ఈ కధనంలో అనేక అవాస్తవాలు ఉన్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి పాజిటివ్ వచ్చి, వారం రోజులు అయ్యింది, ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఇక మాజీ మంత్రి జవహర్ అయితే, తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తనకు కో-ర-నా వచ్చి వారం రోజులు దాటిందని, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమి లేదని, అయితే ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, ఆ రిపోర్ట్ కూడా మీ ప్రభుత్వానిదే, నెగటివ్ వచ్చింది చూసుకోండి అంటూ, మీడియాకు విడుదల చేసారు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన బ్లూ మీడియా ఆ వార్తను వెనక్కి తీసుకోవాలిని జవహర్ కోరారు. కేవలం అబద్ధాలను ప్రసారం చేస్తూ, పబ్బం గడుపు కోవటం సరికాదుని సదరు మీడియాకు హితవు పలికారు. తనకు మళ్ళీ ఏదో అయిపొయింది అంటూ, ఈ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలు చూసి, సహచరులను,అభిమానుల నుంచి ఫోనులు వస్తున్నాయని, వారిని ఇలాంటి తప్పుడు వార్తలతో తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read