ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయుకుడు జేసీ దివాకర్ రెడ్డి, ఈ రోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వచ్చారు. కేసీఆర్ ని కలిసేందుకు ప్రయత్నం చేసారు. అయితే ప్రగతి భవన్ లోకి వెళ్ళాలి అన్నా, కేసీఆర్ ని కానీ, కేటీఆర్ ని కానీ కలవలాన్నా, అప్పాయింట్మెంట్ తప్పనిసరి కావలసిన పరిస్థితి ఉంది. అయితే జేసీ మాత్రం ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా, యాన్ ప్రగతి భవన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేసారు. అయితే ప్రగతి భవన్ సిబ్బంది, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది జేసీ దివాకర్ రెడ్డిని వారించారు. అనుమతి లేనిదే తాము ఎట్టి పరిస్థితిలో కూడా లోపలకు అనుమతించ లేమని, దయ చేసి అర్ధం చేసుకోవాలని, లేదా ప్రగతి భవన్ లోని పెద్దల నుంచి ఫోన్ చేసినా పంపిస్తామని అన్నారు. అయితే జేసీ మాత్రం, తనకు అపాయింట్మెంట్ ఇచ్చేది ఏమిటి, లోపలకు వెళ్తానని ఆయన వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ ని కాకపోయినా, కేటీఆర్ తో అయినా కలుస్తానని, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మాత్రం, అపాయింట్మెంట్ లేనిదే తాము అనుమతి ఇవ్వలేమని, అర్ధం చేసుకోవాలని అన్నారు. దీంతో జేసీ ఏమి చేసేది లేక, వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.

jc 19012022 2

జేసీ దివాకర్ రెడ్డి, ఈ మధ్య తరుచూ తెలంగాణా అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీకి, అలాగే తెలంగాణాలో ఉన్న గాంధీ భవన్ కు వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాల గురించి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం, ఇవన్నీ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే అప్పట్లో ఆయన తాను కేసీఆర్ ని కలుస్తానని, అనేక విషయాలు చర్చిస్తామని చెప్పారు. అయితే ఇదే తరహాలు ఇప్పుడు ఆయన, ఏకంగా కేసీఆర్ ఇంటికి అపాయింట్మెంట్ లేకుండా, రావాటం తో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్ తో అయినా కలుస్తానని ఆయన చెప్పినా కూడా, పోలీసులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి తప్పక ఇక వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి తరుచూ ఇలాంటి సంచలనాలు చేస్తూ ఉంటారు. ఆయనది వేరే స్టైల్. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆయన ప్రగతి భవన్ కు రావటం, కేసీఆర్ ని కలవటం చేయలేదు. మరి ఈ విషయం తెలిసి, కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read