జడ్జి రామకృష్ణ, జగన్ మోహన్ రెడ్డిని, కంసుడితో పోల్చారు అంటూ, ఆయన పై పోలీసులు దేశ ద్రోహం కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో ఆయనకు కో-వి-డ్ నెగటివ్ ఉందని చెప్పి, ఇప్పుడు పోజిటివ్ ఉందని చెప్పటం పై, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను పీలేరు నుంచి తిరుపతి తీసుకురావటం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని, తన తండ్రికి ఏమైనా జరిగితే పెద్దిరెడ్డి దే బాధ్యత అని ఆయన కుమారుడు వాపోయారు. ఇక, ప్రభుత్వం తనకు గిట్టనివారిపై కక్షసాధింపుధోరణితో వెళుతోందని, పగ,ప్రతీకారం, కక్ష,కార్పణ్యాలతో ప్రభుత్వం ముందుకుసాగడం దురదృష్టకరమని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వాపోయారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "కొన్నికారణాలవల్ల సస్పెన్షన్ లో ఉన్న జడ్జిరామకృష్ణపై ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షబూనాడు. అసలు రామకృష్ణ అనేవ్యక్తి ఈ భూమ్మీద ఉండనేకూడదన్నట్లుగా మంత్రిపెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నాడు. రామకృష్ణ ఫిర్యాదుచేస్తే పట్టించుకోని ప్రభుత్వం, ఆయనేదైనా చిన్నతప్పుచేసి నా భూతద్దంలో చూస్తోంది. దళితజడ్జీ రామకృష్ణ ఎక్కడున్నాడో చెప్పాలని నేను జగన్మోహన్ రెడ్డిని, మంత్రిపెద్దిరెడ్డిని ప్రశ్నిస్తున్నా. రామకృష్ణ అరెస్ట్ అయ్యా డు...జైల్లో ఉన్నాడని మీరంటారు.. అతనికి కో-వి-డ్ వచ్చిందని చెబుతున్నారు. క-రో-నా వస్తే ఆయనకు టెస్ట్ చేశారు.. టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. ఆయన్ని చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకొచ్చారు. రామకృష్ణ ప్రాణానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో హని ఉంది. అతను చనిపోయే ప్రమాదముంది. కరోనా పేరిట రామ కృష్ణను మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చనిపోయేలా చేసినా కూడాఆశ్చర్యం లేదని నేనంటాను.

ఈ ప్రభు త్వం, ముఖ్యమంత్రి ఒకదళితుడు అనవసరంగా మర ణించకుండా రక్షణకల్పిస్తుందో లేదో సమాధానంచెప్పా లి. రామకృష్ణకు పూర్తిరక్షణ కల్పించి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేతిలో అతనికి ప్రా-ణ-హా-ని లేకుండా చూడాలని తోటి దళితుడిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నా. దళితసంఘాలు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాయి. తిరుపతిలో రామకృష్ణను ఎప్పుడైతే కరోనా ఆసుపత్రిలో చేర్చారో, అప్పుడే అతని ప్రా-ణా-లు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేతికి చిక్కాయని నేనంటున్నా. రామకృష్ణను పీలేరు సబ్ జైలు నుంచి చిత్తూరుకు, అక్కడినుంచి తిరుపతికి తరలించారో, ఎక్కడైతే అతను క-రో-నా చికిత్స పొందు తున్నాడో, అప్పుడే అతని ప్రాణం పెద్దిరెడ్డి చేతికి వచ్చిం ది. పెద్దిరెడ్డి బతుకు అంటే రామకృష్ణ బతుకుతాడు... చావు అంటే చ-చ్చి-పో-తా-డు. అటువంటి రామకృష్ణకు ఎవరు రక్షణకల్పిస్తారు? ఈ వ్యవహారంపై మేం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు లేఖరాయబోతున్నాం. వారికి లేఖ రాసినాకూడా, వారు తిరిగి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలి యచేస్తారు. మరలా అటూఇటూ తిరిగి రామకృష్ణకు రక్షణ కల్పించాలని డీజీనే కోరతారు. ఈ డీజీపీ ఎవరు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే వ్యక్తి. ఇక అలాంటప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది? ఈ డీజీపీ ఉండగా పోలీస్ వ్యవస్థలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటకు వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా? అందుకే ముఖ్యమంత్రినే అడుగుతు న్నా. ఒక దళితుడు చనిపోతే, అది ముఖ్యమంత్రికి ప్రభుత్వానికే అరిష్టము. దళితుడిప్రాణాన్ని కాపాడండి అని కోరుతున్నా." అని రామయ్య అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read