జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ సంభాషణలకు సంబంధించి, సుప్రీం కోర్టు, ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల్లో ఎక్కడా స్పష్టత లేకపోవటంతో, మళ్ళీ ఇది హైకోర్టుకు చేరింది అనే చెప్పాలి. గతంలో ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగగా, దీని పై విచారణ జరపాలి అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాల పై, ఇప్పుడు సుప్రీం కోర్టులో విచారణ జరగగా, ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అటు పూర్తిగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని తప్పుబట్టలేదు, అలాగే తీర్పుని సమర్ధించను లేదు. అసలు ఈ కేసుకి సంబంధించి, హైకోర్టు ఆదేశించకుండా ఉండాల్సింది అంటూ, సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ పిల్ విషయంలోని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుని ఉంటే సరిపోయేదని వ్యాఖ్యానించింది. ఆ పిల్ మైన్టైన్ అవుతుందా లేదా అనే విషయంలో నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. అది చేయకుండా, ఆ పిల్ మైన్టైన్ అవుతుందా లేదా అనేది చూసి, ఆ తరువాత దర్యాప్తుకు ఆదేశించి ఉంటే బాగుండేదని సుప్రీం కోర్టు వ్యఖ్యానిచింది. దానికి ముందుగానే, పిల్ మైంటైన్ అవుతుందో లేదో చూడకుండా, విచారణకు ఆదేశించకుండా ఉండాల్సింది అంటూ, మాత్రమే సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది.

eswaraiah 12042021 2

అయితే పిల్ లో ఉన్న మెరిట్స్ పైన మాత్రం సుప్రీం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ పిల్ మైంటైన్ అవుతుందో లేదో, అలాగే పిల్ లో ఉన్న మెరిట్స్ ఏమిటి అనేది హైకోర్టు తేల్చాలని, మేము దాని పై ఎటువంటి వ్యాఖ్యలు చేయ దలుచుకోలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుకు సంబంధించి, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ, జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులోనే జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. జడ్జి రామకృష్ణ ఈ కేసులో కపిల్ సిబాల్ న్యాయవాదిగా తమ వాదనలు వినిపించారు. అదే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య తరుపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు అన్నీ విని, తీర్పు ఇవ్వటానికి సుప్రీం కోర్టు రెడీగా ఉన్న సమయంలో, జడ్జి రామకృష్ణ మరో పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసులో ముఖ్యమైన ఆధారం అయిన తన ఫోన్ ని పోలీసులు సరండర్ చేసుకుని, ఆ తుర్వత సెల్ ఫోన్ పోయింది అంటూ, పోలీసులు చెప్పారని కోర్టుకు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read