సాక్షాలు చూపెట్టాం.. కొడాలి నానీ ఎప్పుడు ఆత్మ హ-త్య చేసుకుంటారు? ఎప్పడు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని టీడీజీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీకోసం.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ మాట్లాడుతూ తనకు సంబంధంచిన కే కన్వెన్షన్ లోను, తనకు సంబంధించిన స్థలాలలో ఎక్కడా జూదం జరగలేదని బుకాయించారు. పైగా నిరూపిస్తే తాను ఆత్మ-హ-త్య చేసుకుంటానని మాట్లాడారు. గుడివాడలో కొడాలి నానికి సంబందించిన స్థలంలో, కే కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమాలు ఏ సోషల్ మీడియాలో కొట్టినా వస్తాయి. నానీకి సంబంధించిన స్థలంలో ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి క్యాసినోలు, జూదాలు, డ్యాన్సులు నిర్వహించారు. ఇవాళ రాష్ట్ర ప్రజల సాక్షిగా మేం ప్రజల ముందు ఉంచాం. సోషల్ మీడియాలో కో కొల్లలుగా వీడియోలు చూడొచ్చు. కొడాలి నాని బాధ్యత గల ఒక మంత్రిగా ఉండి ఇలా చేయొచ్చా? ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ లో, ఆయనకు సంబంధించిన స్థలంలో మూడు రోజులపాటు భారీ సెట్టింగులు వేసి, క్యాసినోలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జూదం, డ్యాన్సులు జరిగాయి. అందులో పాల్గొనాలంటే ప్రతి వ్యక్తి పది వేలు చెల్లించాలి. రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి బహిరంగంగా క్యాసినో నడిపిస్తే ముఖ్యమంత్రి, డీజీపీల మౌనం దేనికి సంకేతం? రాష్ట్ర రాజధానిలోని సీఎం డీజీపీలుండే కేంద్రానికి అతి సమీపంలో ఒక మంత్రి ఇంతగా బరితెగించి క్యాసినోలు, డ్యాన్సులు చేయిస్తే ప్రభుత్వ వ్యవస్థలకి తెలియకుండా పోతుందా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? పరిపాలన సాగుతోందా? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్ని అ-ఘా-యి-త్యా-ల-కు పాల్పడిన మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయరు? దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి ఇందుకు సహకరిస్తూ, సమర్థిస్తున్నట్లుగా ఉంది. మా వాళ్లు మూడు రాజధానులే అంటున్నారు, కొత్తగా మాకు నాల్గవ రాజధాని వచ్చిందని వైసీపీ నాయకులే అంటున్నారు.

కొత్తగా జూద రాజధానిగా గుడివాడ అని చెప్పుకోవచ్చేమో. నిరూపించండి పెట్రోల్ పోసుకొని ఆ-త్మ-హ-త్య చేసుకుంటా, రాజకీయాలు మానేస్తాను, సన్యాసం పుచ్చుకుంటా అని నాని అన్నారు, అదెప్పుడు చేస్తారు. ఏసిస్ క్యాసినోతో వైసీపీ నాయకులు బేరం కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా? అఫిషియల్ గా నానీ నిర్వాహకుడు కాదా? ఏసిస్ క్యాసినో ప్రేమల్ టోపీవాలా వైసీపీ మనిషి కాదా?. అఫిషియల్ పేజీలో పేర్కొనలేదా? కళ్లముందు నిలువెత్తు నిజాలు కనబడుతున్నాయి. ఏఎస్ఎస్ క్యాసినోవారితో ఒప్పందం చేసుకొని వారిని గుడివాడకు తీసుకొచ్చి మూడు రోజులపాటు గుడివాడలో క్యాసినో నిర్వహించారు. మేం నిరూపించాం. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా మీరెప్పుడు చేస్తారు? నాని నిరూపించండి పెట్రోల్ పోసుకొని ఆ-త్మ-హ-త్య చేసుకుంటా, రాజకీయాలు మానేస్తాను, సన్యాసం పుచ్చుకుంటా అని నాని ఎప్పడు చేసుకుంటారు? ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా క్యాసినోలు నిర్వహిస్తూ మహిళల్ని విలాస వస్తువులగానో, ఆట వస్తువులుగానో చేసిన మంత్రికి క్యాబినెట్ లో ఉండే అర్హత లేదు. నీతులు చెబుతుంటే వినాల్సిన దౌర్భాగ్యం మనది. చాలా బరితెగింపుగా మాట్లాడుతున్నారు. జరిగినదాన్ని దేశమంతా చూశారు. అందరికీ తెలుసు అది బహిరంగ రహస్యం. పైగా బరితెగించి మాట్లాడటం సిగ్గుచేటు. మంత్రి మాట్లాడే భాష జుగుప్సాకరంగా ఉంటోంది. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన భాషలో మార్పు రావాలి. ధైర్యంగా క్యాసినో జూదం, అశ్లీల నృత్యాలు నేనే నిర్వహించానంటే సంతోషించేవాళ్లం. విషయాన్ని పక్కదారి పట్టించారు.

చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తే మీరు చేసిన తప్పులు ఒప్పులైపోతాయనుకోవద్దు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి పౌరులకు ఉపయోగపడాల్సివారు ఆ పనిని గాలి కొదిలేశారు. క్యాసినోలు నడింపించడంలో ఉన్న శ్రద్ధ రైతుల మీద, ఆ శాఖ నిర్వహణ మీద లేకపోవడం బాధాకరం. ఫొటోలు, వీడియోలు బహిరంగంగా కనపడుతుంటే ఇంకా సాక్ష్యాలు కావాలా? మూడు రోజులుగా గుడివాడ నడిబొడ్డులో క్యాసినో, జూదాలు, డ్యాన్సులు నిర్వహిస్తుంటే పోలీసులు ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. సామాన్యులు పేకాట ఆడితే దాడి చేసి పట్టుకొని కేసులు నమోదు చేస్తారు. ఫైన్లు వేస్తారు. ఇంత పబ్లిక్ గా ఫేస్ బుక్ లలో, సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేసి, బహిరంగంగా డబ్బులు వసూలు చేశారు. అయినా చర్యలు లేవు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడో లేడో అర్థం కావడంలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటి గుడివాడకు వెళ్లడంలో కుట్ర కోణం దాగివుందనడంలో అర్థంలేదు. ఆంధ్రప్రదేశ్ ను జూద నిలయంగా మార్చినా, ఏపీ ప్రతిష్ట దిగజారినా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఎవరిమీద లేని జూదము, డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు కేవలం కొడాలి నానీపైనే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. జరిగాయి కాబట్టే వచ్చాయని. వీరు ఆంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చినా ఆశ్చర్యపోనక్కరలేదని మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read