కేఏ పాల్.. ఈ పేరు తెలియని దేశాల వారు ఉండరు. తెలుగు ప్రజలకే, ఈయన అంటే చులకన. ఒకప్పుడు దేశాధ్యక్షులను కంట్రోల్ చేసిన పాల్, ఇప్పుడు ఆయన చేష్టలతో సొంత రాష్ట్రంలోనే కామెడీ అయ్యారు. ప్రజా రాజ్యం పేరుతో కేఏ పాల్ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేఏ పాల్ పార్టీ ఏదో కామెడీ చేస్తుంది అనుకుంటే, ఆయన తన దమ్ము ఏంటో చూపించారు. ప్రస్తుతానికి కేఏ పాల్ తెలంగాణా రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. కేఏ పాల్, రేపు జరగబోయే మునుగోడు ఉప ఎన్నిక కోసం కసరత్తు చేస్తూ, ఏకంగా ఒక కొత్త అభ్యర్ధిని దింపారు. ఆ అభ్యర్ధి ఎవరో కాదు. ప్రజాగాయకుడు గద్దర్. తన ఆట పాటలతో, తెలంగాణా సమాజంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. అలాంటి గద్దర్, ఇప్పుడు తెలంగాణా ఉప ఎన్నికలో పోటీ చేయటం, అది కూడా ప్రజా శాంతి పార్టీలో చేరి, పోటీ చేయటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. కేఏ పాల్ ని కామెడీగా తీసుకున్న వాళ్ళు, అవాక్కయ్యారు. ఇప్పుడు గద్దర్ ఎవరి ఓట్లు చీల్చుతారో అని , ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ టెన్షన్ పడుతున్నాయి. మొత్తానికి కామెడీ పండించే కేఏ పాల్, తాను సీరియస్ పొలిటీషయిన్ అనే సంకేతాలు పంపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read