తెలుగుదేశం పార్టీ నేతల పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావుని, ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో, పోలీసులు అరెస్ట్ చేసారు. కళా వెంకట్రావ్ ని రాజాంలో, పోలీసులు ఆయన ఇంటి ఒకేసారి వచ్చి, అరెస్ట్ చేసారు. ఆయన్ను ఎందుకు తీసుకు వెళ్తున్నారో, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో పోలీసులు చెప్పలేదని, తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. నెల రోజులు క్రితం, చంద్రబాబు రామతీర్ధం పర్యటన సందర్భంలో, విజయసాయి రెడ్డి పై చెప్పులు విసిరిన ఘటనలో, చంద్రబాబు, కళా వెంకట్రావ్, అచ్చేన్నాయుడు పై కేసులు నమోదు చేసారు. హ-త్యా-య-త్నం కేసు నమోదు చేసారు. దీంతో ఈ కేసు విషయంలోనే కళా వెంకట్రావ్ ని పోలీసులు అరెస్ట్ చేసారని తెలుస్తుంది. అసలు చెప్పులు విసిరిన ఘటనలో, కళా వెంకట్రావ్ లాంటి సీనియర్ నేత, సౌమ్యుడు అయిన నేత, విజయసాయి రెడ్డి పై, రాళ్ళు విసరటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇలాంటి చిన్న కేసులో కూడా, ఇంత పెద్ద వయసు ఉన్న వ్యక్తని, మాజీ మంత్రి, సీనియర్ నేతను, ఇలా రాత్రి పూట వచ్చి, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నాయి.

kala 202012021 2

అయితే కళా వెంకట్రావ్ అరెస్ట్ విషయం, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి సమాచారం వచ్చింది. ఈ విషయం పై తెలుగుదేశం శ్రేణులు మండి పడుతున్నాయి. అసలు రామతీర్ధం ఘటనలో రాముడు తల ఎవరు పెకలించారో ఇప్పటి వరకు తెలియదు కానీ, ఘటన ఎందుకు జరిగింది అంటూ, అక్కడకు వెళ్లి నిరసన తెలిపిన వారిని, అరెస్ట్ చేయటం దారుణం అని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అసలు చంద్రబాబు గారు వస్తాను అని చెప్పిన తరువాత, విజయసాయి రెడ్డిని ఎలా పోలీసులు అనుమతించారని, వాపోతున్నారు. లేని వివాదం సృష్టించింది విజయసాయి రెడ్డి అని, అలాంటిది, తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేయటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని లాంటి వాడు కొడతా, తంతా అంటూ ఇష్టం వచ్చినట్టు ఊరి మీద పడి వాగుతున్న వాడిని ఆర్రేస్ట్ చేయకుండా, కళా వెంకట్రావ్ లాంటి సౌమ్యుడుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో డీజీపీ చెప్పాలని వాపోతున్నారు. ఈ విషయం పై, కళా వెంకట్రావ్ తో పాటు, కేసు పెట్టిన చంద్రబాబు, అచ్చెన్నాయుడుని కూడా అరెస్ట్ చేస్తారా అని తెలుగుదేశం నేతలు వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read