తెలంగాణాలో ఎన్నికలు వస్తున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేయటం, లేదా ఇక్కడ రాజకీయ నాయకులను బూచిగా చూపెట్టి, రాజకీయం చేయటం చూసాం. అయితే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి, తెలంగాణాలో అధికార పార్టీకి ఆ అవకాసం వచ్చింది. అందులోనూ, ఏపిని ఒక్క మాట అంటే, చంద్రబాబు అధికార స్థానంలో ఉండి ఊరుకునే వారు కాదు. ఆంధ్రప్రదేశ్ ను పరిరక్షించే స్థానంలో, అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఘాటుగా బదులు ఇచ్చే వారు. అయితే దానికి ప్రాంతీయ వాదం జోడించి, అవతల ఉన్న తెలంగాణా పార్టీ, రాజకీయంగా వాడుకుని లబ్ది పొందుతూ ఉండేది. అయితే ఈ సారి తెలంగాణాలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి. కానీ ఈ సారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు లేరు. అలాగే ఆయన తెలంగాణా రాజకీయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా, తెలంగాణా పార్టీ స్థానిక నాయకత్వానికి బాధ్యతలు ఇచ్చేసారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణా రాష్ట్ర అధినేతలను, మిత్రపక్షంగా ఉండే వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ ఎలాగూ హైదరాబాద్ లో పోటీ చేయదు. అక్కడ పార్టీ ఎప్పుడో మూసేసారు. దీంతో, చంద్రబాబు లేకపోవటం, తమ మిత్రపక్షం లాంటి పార్టీ ఉండటంతో, ఈ సారి తెలంగాణా ఎన్నికల్లో ఆంధ్రాను బూచిగా చూపించటం కుదరదు.

kcr 19112020 2

అందుకే, వేరే వ్యూహంతో తెలంగాణా రాజకీయ పార్టీ వచ్చినట్టు ఉంది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ మనలను తొక్కేస్తుంది అంటూ, చంద్రబాబుని బూచిగా చూపించి చెప్పేవారు. అయితే ఇప్పుడు వ్యూహం మార్చి, ఆంధ్రప్రదేశ్ ను తక్కువ చేసే ప్రయత్నం చేసి, లబ్ది పొందాలని అనుకుంటున్నారు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ, రాజకీయ ఉపన్యాసం ఇస్తూ, ఇరిగేషన్ రంగంలో తాము అనేక విజయాలు సాధించామని, డంభాచారం కొట్టి, మీరు విడిపోతే మీ పని అయిపోతుంది అంటూ చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడో అట్టడుగుకు తోసేశాం అని, వరి పండించటంలో ఆంధ్రప్రదేశ్ కేలవం 50 లక్షల ఎకరాలు ఉంటే, మనం కోటి ఎకరాలు సాగు చేస్తున్నాం అంటూ, కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ నంబర్స్ లో నిజం ఉందో లేదో తెలియదు కానీ, ఇలా ఒక రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం మాత్రం గర్హనీయం. మరి గతంలో లాగా, ఇప్పటి ఆంధ్రా పాలకులు కేసీఆర్ కు గట్టి సమాధానం చెప్పి, ఇది మేము సాధించిన ప్రగతి, మీ మాటలు తప్పు అని చెప్తారో, లేకపోతే వ్యక్తిగత స్నేహం ముందు, ఆంధ్రప్రదేశ్ ని అట్టడుగుకు తోసేశాం అని చెప్పినా, మౌనంగా ఉంటారో చూడాలి. కేసిఆర్ వ్యాఖ్యల పై కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంత వాసులు మాత్రం, సోషల్ మీడియాలో దీటుగా బదులు ఇస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read