లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ముందుగా ప్రధాని కేదారేశ్వరుణ్ణి సందర్శించుకుని, పూజలు చేశారు. తరువాత అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ నేపధ్యంలో ప్రధాని కేదార్‌నాథ్ సందర్శనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటి మధ్యలో ఒక ఫొటోను చూసిన నెటిజన్లు... ప్రధానికి ఫొటో తీసిన ఫొటో‌గ్రాఫర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేదారనాథుణ్ణి పూజిస్తుండగా, ఒక కెమెరామ్యాన్ అతని ఫొటో తీయడంలో మునిగిపోయాడు. మోదీకి ఆయన ఫొటో తీస్తున్న విధానాన్ని గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారు.

kedarnath 19052019 2

మరో పక్క, మోదీ కేదార్‌నాథ్‌లోని ఒక పవిత్ర గుహలో ధ్యానం చేశారు. ప్రధాని ధ్యానం చేసిన గుహ కావడంతో దీని విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో కలుగుతోంది. ఈ గుహ అత్యంత పురాతననమైనదేమీ కాదు. కేదార్‌నాథ్ అభివృద్ధి బాధ్యతలను ప్రధాని తీసుకున్న తరువాత ఈ గుహ నిర్మాణం జరిగింది. ఈ గుహ పేరు ‘రుద్ర గుహ’. గత ఏడాదే ఈ గుహను నిర్మించారు. 12250 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. దీనిలో భక్తులు ధ్యానంతో పాటు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ గుహ ప్రాకృతికంగా ఏర్పడినదేమీ కాదు. ఈ గుహ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్‌కు చెందిన టూరిజం ప్రాపర్టీ. కేవలం రూ. 3000 చెల్లించి ఈ గుహలో ప్రవేశం పొంది, మూడు రోజులపాటు ఉండవచ్చు. ధ్యానంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన ఈ గుహలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. టాయిలెట్, విద్యుత్, టెలిఫోన్ తదితర ఆధునిక సదుపాయాలు సమకూర్చారు.

kedarnath 19052019 3

మోదీ కేదార్‌నాథ్‌లో ధ్యానానికి కూర్చోవడంపై కాంగ్రెస్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశ్నలు ఎక్కుపెట్టారు. మోదీ తన చర్య ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని నిలదీశారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మోదీ ప్రార్థనలు చేయడం, సమీపంలోని గుహల్లో ధ్యానం చేయడం, కాషాయం శాలువాతో ఆయన ధ్యానం చేస్తున్న ఫోటోలను పత్రికలు, టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి. 'ఇవాళ ఆయన కాషాయం ధరించి గుహలో కూర్చున్నారు. ఆయన ఏమి కావాలని కోరుకుంటున్నారో భగవంతుడికి తెలుసు. అందరి దృష్టి ఆయనపైనే ఉంది' అని గెహ్లాట్ అన్నారు. పోలరైజేషన్ తప్ప మోదీ చేసిందేమీ లేదని కూడా ఆయన చురకలు వేశాలు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా సైతం ట్విట్టర్‌లో తన అభిప్రాయం పంచుకున్నారు. 'భగవంతుడి స్థావరానికి వెళ్లేటప్పుడు నిజమైన భక్తుడు తన అహంకారాన్ని, దర్పాన్ని వదులుకుంటాడు. రెడ్ కార్పెట్ సదుపాయాలతో వెళ్లరు. మోదీజీ...మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను' అని సూర్జేవాలా ట్వీట్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read