ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా గుడివాడలో ఏకంగా గోవా తరహా క్యాసినో రావటం పై, ఏపి ప్రజలతో పాటు, పక్క రాష్ట్రాల వారు కూడా షాక్ తిన్నారు. గుడివాడలోని కొడాలి నాని కన్వేషన్ సెంటర్ లో తెరిచిన ఈ దుకాణం పై, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, మీడియాలో కధనాలు వచ్చాయి. అయినా సరే, యధేచ్చగా మూడు రోజులు పాటు కొనసాగాయి. పోలీసులు మీ మూడు రోజులు అటు వైపు చూడలేదు. దీని పైన తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. విషయం పెద్దది కావటం, ప్రజల్లో వ్యతిరేకత రావటంతో, ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అధికారాల్లో కదలిక వచ్చింది. కృష్ణా జిల్లా ఎస్పీ దీని పైన స్పందించారు. అయితే స్థానిక పోలీసులు అయితే, ఒత్తిడికి తలొగ్గుతారని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను, ఈ అంశం పై విచారణ అధికారిగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ నియమించారు. అయితే ఈ విచారణ మొత్తం నిజంగా వాస్తవాలు బయటకు తీస్తారా, లేక తూతూ మంత్రంగా ముగిస్తారా అనేది చూడాల్సి ఉండి. మొత్తం మంత్రి కొడాలి నాని ఇలాకలో ఈ వ్యవహారం జరిగిన విషయం తెలిసిందే. స్థానిక పోలీసులు అందరూ కొడాలి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. అందుకే మూడు రోజుల పాటు, అంత పెద్ద ఎత్తున జరిగినా, అటు వైపు ఎవరూ వెళ్ళే సాహసం కూడా చేయలేదు.

kodali 19012022 2

ఈ అంశం దృష్టిలో పెట్టుకునే, నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులను విచారణ అధికారిగా వేసారు. అయితే శ్రీనివాసులు వాస్తవాలు బయటకు తెస్తారో లేదో చూడాలి. అసలు అక్కడ ఏమి జరిగింది ? మంత్రి కళ్యాణమండపంలోనే ఎలా ఏర్పాటు చేసారు ? దీని వెనుక ఉన్న బడా బాబులు ఎవరు ? నిర్వాహకులు ఎవరు ? పోలీసులు అటు వైపు ఎందుకు వెళ్ళలేదు ? ఎంత వసూలు చేసారు ? ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ జరిగాయి, ఇలా అనేక అంశాలు బయటకు వస్తాయో రావో చూడాల్సి ఉంది. మధ్య తరగతి ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున నష్టపోయారని వార్తలు వస్తున్నాయి. మరో పక్క ఈ విషయం పై ఇప్పటికే కొంత మంది హైకోర్టు కూడా ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో, ఇది పెద్దది అవుతున్న నేపధ్యంలో, తమ పైకి తప్పు రాకుండా, ఎస్పీ ముందుగానే అలెర్ట్ అయ్యారు. విచారణ అధికారిని నియమించారు. మరి వాస్తవాలు బయటకు వస్తాయా ? దీని వెనుక ఉన్న పెద్దలను బయటకు లాగుతారా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read