ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుర్తుండి పోయే సంఘటన, కోడి క-త్తి సీన్. అప్పటి ప్రతిపక్ష నాయుకుడు, జగన్ మోహన్ రెడ్డి, పాదయాత్ర ముగించుకుని, వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ కు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో, ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్న, శీను అనే వ్యక్తి , జగన్ తో సేల్ఫీ దిగుతాను అని చెప్పి దగ్గరకు వచ్చి, కోడి క-త్తి ఒకటి తీసుకుని, జగన్ భుజం పై గుచ్చారు. అయితే తాను సెన్సేషన్ కోసమే ఇలా చేసానని, కోడి క-త్తి శీను, ఒక లెటర్ కూడా జేబులో పెట్టుకున్నారు. ఇక ఆ తరువాత కోడి క-త్తి శీను వైసీపీ సానుభూతి పరుడు అని, అతను జగన్ కోసం కట్టిన ఫ్లెక్స్ లు ఇవన్నీ బయట పడ్డాయి. అయితే దీని పై పెద్ద కుట్ర ఉంది అంటూ, కేంద్రానికి ఫిర్యాదు చెయ్యటంతో, కేంద్రం, ఉగ్రవాదులను ఏరి పారేసి, ఎన్ఐఏ వాళ్లతో ఎంక్వయిరీకి ఆదేశించింది. అయితే, ఆ ఎంక్వయిరీ ఇప్పటి వరకు ఘటన ఎందుకు జరిగింది, ఎవరు చెయ్యమంటే జరిగింది అనే వివరాలు అయితే ఏమి ఇవ్వలేదు. కోడి క-త్తి శీను మాత్రం, అప్పటి నుంచి రిమాండ్ లో ఉన్నారు.

kodikatti 07092020 2

ఈ నేపధ్యంలో ఇప్పుడు కోడి క-త్తి శీను హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసాడు. కోడి క-త్తి కేసులో అరెస్ట్ అయి, రిమాండ్ లో ఉన్న తనకి, బెయిల్ ఇవ్వాలి అంటూ, హైకోర్టు లో పిటీషన్ వేసాడు. ఇప్పటికే ఎన్ఐఏ విచారణ పూర్తి చేసిందని, తాను 21 నెలలుగా జైలులోనే ఉన్నానని, తనకు పెద్ద వయసు ఉన్న తల్లి దండ్రులు ఉన్నారని, వారిని పోషించాల్సిన బాధ్యత తన పైనే ఉందని, కోర్టుకు తెలిపారు. కోర్టు ఇచ్చే షరతులకు లోబడి ఉంటానని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఒక వేల బెయిల్ ఇవ్వలేని పక్షంలో, కనీసం జగన్ మోహన్ రెడ్డిని అయినా, రాబోయే 15 రోజుల్లో ఎన్ఐఏ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని, తన పిటీషన్ లో కోరాడు. ఈ ఏడాది మే 22న బెయిల్ కోడి క-త్తి శీనుకు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే సాక్ష్యులను శీను తారుమారు చేస్తాడని ఎన్ఐఏ వాదించటంతో, కోర్టు బెయిల్ రద్దు చెయ్యటంతో, మళ్ళీ శీనుని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read