పెడన క్వారంటైన్ లో ఉన్న కరోనా అనుమానితుడు గుండెపోటుతో మృతి చెందారు. మచిలీపట్నంలో కరోనా పాజిటీవ్ తో మృతి చెందిన వ్యక్తికి ఈయన బంధువుగా తెలుస్తుంది. గత నాలుగు రోజులుగా పెడన క్వారంటైన్ లో ఉన్న మృతుడు తోట రాజా, గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన రాజాను, హుటాహుటిన 108 అంబులెన్స్ లో విజయవాడకు తరలించారు. అయితే, మార్గమధ్యలో మృతి చెందిరు రాజ. కరోనా రిపోర్ట్ రాకపోవటంతో ఉదయం నుండి మృతదేహాన్ని అధికారులు, కుటుంబ సభ్యులకు అందించలేదు. అయితే చివరకు, రిపోర్ట్ నెగిటీవ్ రావటంతో మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉదయం నుండి రాజా మరణంపై నగర వాసుల్లో ఉత్కంఠత కొనసాగింది. చివరకు నెగిటీవ్ రిపోర్ట్ తో ఊపిరి పీల్చుకున్న అధికారులు, నగర వాసులు. అయితే, ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, విషయం తెలుసుకున్న, స్థానిక తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి, కొల్లు రవీంద్ర, అసలు క్యారంటైం సెంటర్ లో , ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో చూడటానికి బయలు దేరారు.

దీంతో, పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కి పోలీసులకి వాగ్వాదం జరిగింది. పెడన లొ ఉన్న క్యారంటైం కి వెళ్ళనీయకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ని పోలీసులు అడ్డుకుంటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొల్లు రవీంద్ర , కొంచెం సేపు ప్రతిఘటీంచారు. పెడన కోర టైన్ ని పరిశీలించడానికి వెళ్తున్న వాహనాలను పోలిసులు అడ్డుకోవడంతో కొల్లు రవీంద్ర కి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును సీజ్ చేసిన పోలీసు అధికారులు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి క్వారంటైన్ సందర్శనకు వెళుతున్న కొల్లు రవీంద్రని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కొల్లు రవీంద్రకు చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి . ఐపీసీ సెక్షన్ 188 మరియు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1987 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు.

అలాగే కోల్లు రవీంద్రను, పోలీస్ జీప్ ఎక్కించి, తరువాత, విడిచి పెట్టరు. ఆయన కారును సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పై మాట్లాడిన రవీంద్ర, జరిగిన విషయాన్ని చెప్పారు. క్వారంటీన్ లో ఉన్న వ్యక్తి గుండె నొప్పి వచ్చి చనిపోవటం, అతని సోదరుడు కరోనా పాజిటీవ్ తో మృతి చెందటంతో, క్వారంతీన్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో చూడటానికి వెళ్లామని, అయినా పోలీసులు ఆపి, కేసులు పెట్టారని అన్నారు. ఒక పక్క వైసీపీ నేతలు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, మీటింగ్లు పెడుతున్నా, మందలు మందలుగా పోగేసి, హడావిడి చేస్తున్నా, పోలీసులు పట్టించుకోకుండా, మేము ఒంటరిగా వెళ్తున్నా అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. నిన్న కూడా టిడిపి ఎమ్మల్యే సైకిల్ పై కలెక్టర్ వద్దకు వెళ్తుంటే, పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తీసుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read