ఈ రోజు ఉదయం మంత్రి పేర్ని నాని పై ఒక తాపీ మేస్త్రి దా-డి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో మంత్రికి ఏమి అవ్వలేదు. అయితే తాపీ మేస్త్రి ఎందుకు ఈ దాడి చేసారు అనే విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికంగా అతను మద్యం తాగి ఉన్నాడని, పనులు లేక ఇబ్బందులు పడుతూ, మంత్రిని టార్గెట్ చేసారని వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఇంకా పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా చెప్పలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం, ఇందలో కూడా రాజకీయ కోణం తెచ్చారు. ఆ తాపీ మేస్త్రి, వైసీపీ లోకల్ నేతకు ఏదో చుట్టం అని, తెలుగుదేశం పార్టీ ఈ దా-డి చేపించిందని, దీని వెనుక కొల్లు రవీంద్ర ఉన్నారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఇంకా పోలీసులు ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సి ఉండి. ఇద ఇలా ఉండగా, తన పై జరుగుతున్న ప్రచారం పై కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. దీని పై ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, వైసీపీ ప్రచారం ఖండించారు. ఆ ప్రెస్ నోట్ ఇదే " వైసీపీ సృష్టించిన కృత్రిక ఇసుక కొరత వల్ల 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. మంత్రి పేర్ని నాని వద్ద నిరసన తెలిపిన బడుగు నాగేశ్వరరావు టీడీపీకి చెందిన వాడని వైసీపీ నేతలు దుష్పరచారం చేయడం దుర్మార్గం. పనుల్లేక పస్తులుండటంతోనే కార్మికునిగా తన ఆవేదన తెలిపారు. అతను టీడీపీ చెందిన వ్యక్తి అని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం."

kollu 29112020 2

" మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని, నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించి కార్మికులు నిరసన తెలిపారు. ఇసుకాసురులను జగన్ రెడ్డి ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. ఇసుక సక్రమంగా అందడం లేదనడానికి భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కి నిరనన తెలపడమే ప్రత్యక్ష సాక్ష్యం. వైసీపీ నేతలు సృష్టించిన కృత్రిమ కొరతతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల మరణించారు. దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు. 18 నెలలుగా భవన కార్మికులకు పనుల లేకుండా చేసి వారి పొట్టగొట్టారు. పునాదుల్లోకి వెళ్లాల్సిన ఇసుక వైసీపీ నేతల బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తోంది. ఒక్క రోజన్నా మంత్రులు కూర్చుని ఇసుక సమస్యపై మాట్లాడారా? దొరికినకాడికి ఇసుకను వైసీపీ అండ్ కో బొక్కుతోంది. నిర్మాణ రంగాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దోచుకోవడానికి ఇబ్బంది ఎదరవుతోందని రోజుకో పాలసీని తెరపైకి తెస్తున్నారు. సామాన్య కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకూ ఇసుక దోపిడీలో భాగమయ్యారు. అధికారం మళ్లీ రాదన్న భయంతో కుంభకరుల మాదిరి తింటున్నారు. ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు.. ప్రతి ఒక్కరూ జగన్ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారు." అంటూ తన ప్రెస్ నోట్ లో తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read