టిడిపి యువ‌నేత నారా లోకేష్ పాద‌యాత్ర ప్రారంభమైంది. కుటుంబ‌మంతా ఆయ‌న వెంటే న‌డిచింది. వంద రోజులు పాద‌యాత్ర పూర్తి చేసుకున్నారు. నారా, నంద‌మూరి కుటుంబాలు వంద‌రోజుల పాద‌యాత్ర‌కి సంఘీభావంగా పాల్గొన్నారు. ఇదే స‌మ‌యంలో మ‌ద‌ర్స్ డే జ‌రిగింది. లోకేష్ త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రికి శుభాకాంక్షలు సోష‌ల్ మీడియా ద్వారా చెప్పాడు. ఆ త‌రువాత రోజే అమ్మ భువ‌నేశ్వ‌రి కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి లోకేష్ పాద‌యాత్ర‌కి వ‌చ్చి వెంట న‌డిచారు. దీనినే టిడిపి నేత‌లు ఎత్తి చూపుతున్నారు.
మదర్స్ డే రోజు జన్మనిచ్చిన తల్లికి కనీస శుభాకాంక్షలు కూడా తెలపని వాడు, ప్రజలకు మీ బిడ్డనని చెప్పుకుంటున్నాడ‌ని టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యుడు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు జ‌గ‌న్ రెడ్డిని నిల‌దీశారు. పాదయాత్ర లో తల్లికి ప్రేమతో షూ లేస్ కట్టిన వ్యక్తిత్వం లోకేష్ దైతే, కన్న తల్లికి ఉన్న పదవులు పీకేసి రాష్ట్రం నుంచి తరిమేసిన బుద్ధి జగన్మోహన్ రెడ్డి ది అని ఆరోపించారు. టిడిపి నేత‌లు ఆరోపిస్తున్న‌ట్టు, జ‌గ‌న్ రెడ్డి త‌న త‌ల్లిని ప‌ద‌వుల్నించి బ‌ల‌వంతంగా రిజైన్ చేయించారు. తెలంగాణ‌లో త‌ల‌దాచుకుంటోంది. డిఎల్ ర‌వీంద్రారెడ్డి కూడా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌ల్లి, చెల్లి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పిన సంగ‌తి టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌లకి మ్యాచ్ అవుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read