తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, గత 40 ఏళ్ళుగా మచ్చ వేద్దామని అనేక మంది అనుకుని చతికిలబడ్డారు. అప్పటి ఇందిరా గాంధీ నుంచి, నేటి జగన్ మోహన్ రెడ్డి వరకు, ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు పై ఆరోపణలు తప్ప, ఆయన తప్పు చేసారని ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేక పోయారు. 2019 ఎన్నికల ముందు, ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్ లో, చంద్రబాబుని ఏదో ఒక అవినీతి కేసులో ఇరికించాలని, ఫైల్స్ అన్నీ తిరగేవేసారని, ఒక్క ఆధారం కూడా లేకపోవటంతో, కేవలం రాజకీయ ఆరోపణలతోనే సరి పెట్టారని చెప్తూ ఉంటారు. చంద్రబాబు అంత నిజాయతీగా ఉన్నారు కాబట్టే, ఆయన 40 ఏళ్ళు ఏ మచ్చ లేకుండా రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆయన పై ఎన్నో కేసులు ఎంతో మంది వేసారు, వేస్తూనే ఉన్నారు. అయితే, ఇలాంటి కేసుల్లో ఒకటి లక్ష్మీపార్వతి వేసిన ఒక కేసు. 2005లో చంద్రబాబుకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అంటూ, అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రోద్బలంతో, లక్ష్మీపార్వతి, ఏసిబిలో కేసు వేసారు. అయితే అప్పట్లో చంద్రబాబు ఆ కేసు పై స్టే తెచ్చుకున్నారు. ఇప్పటికి చంద్రబాబు పై, కేవలం ఈ ఒక్క కేసులోనే స్టే ఉంది. అయితే, ఈ మధ్య సుప్రీం కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది.

lp 03052021 2

రాజకీయ నాయకుల పై కేసులు తెల్చేయలని చెప్పటంతో, చంద్రబాబు కేసు పై ఉన్న స్టే ఎత్తివేసారు. దీంతో లక్ష్మీపార్వతి ఏసిబి లో వేసిన కేసు పై, ఏసిబి కోర్టులో గత కొన్ని నెలలుగా విచారణ జరిగింది. అయితే దీని పై విచారణ చేసిన కోర్టు, అసలు లక్ష్మీపార్వతి వేసిన పిటీషన్ కు అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ రోజు ఈ కేసుని కొట్టేసింది. ఈ కేసులో తగిన ఆధారాలు ఏమి ఆమె చూపించలేకపోయారని, ఏసిబి కోర్టు స్పష్టం చేస్తూ, ఈ కేసుని కొట్టేసింది. దీంతో ఇప్పటి వరకు స్టే ఉన్న ఈ ఒక్క కేసులో కూడా చంద్రబాబు ఫ్రీ అయ్యారు. ఇప్పుడు కేవలం జగన్ మోహన్ రెడ్డి, తాజాగా వేసిన అమరావతి ఏసిబి కేసు తప్పితే చంద్రబాబు పై ఒక్క కేసు కూడా స్టే లేదు. మొన్నటి దాకా 18 స్టేలు అంటూ తప్పుడు ప్రచారం చేసిన బులుగు మీడియా, ఇప్పటికైనా సరిగ్గా రిపోర్టింగ్ చేస్తుందో లేదో మరి. అయితే ఇది మాత్రం లక్ష్మీపార్వతికి షాక్ అనే చెప్పాలి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వేయమంటే కేసు వేసారు కానీ, ఆధారాలు చూపించలేక పోవటం, ఇప్పుడు కొడుకు హయాంలో కేసు కొట్టేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read