ఎన్నికలు ముగిసాయి... ఫలితాలకు 43 రోజుల సమయం ఉంది... ఈ గ్యాప్ లోనే చంద్రబాబుని టార్గెట్ చెయ్యగలం, తరువాత ఎలాగూ చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా తాట తీస్తాడు అని తెలిసిన, ఢిల్లీ పెద్దలు, సరిహద్దుల దొరలు, ఆంధ్రా ద్రోహులు, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ఎత్తు వేసారు. ఇది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయం కాబట్టి, ఎన్నికల కమిషన్‌ ని అడ్డు పెట్టుకుని ఏపి పై తుపాకీ పెల్చుతున్నారు. ఇప్పటకే తమకు అనుకూలమైన చీఫ్ సెక్రటరీని పెట్టుకుని, ఎన్ని ఆటలు ఆడుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా, ఓట్ల లెక్కింపు వంటి అంశాలను కూడా చీఫ్ సెక్రటరీకి అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రక్రియతో ఏమాత్రం సంబంధంలేని, అసలు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకునే అవసరం/అధికారమే లేని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంకు ఎందుకు ఇలా చెయ్యమని చెప్పారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

lv 24042019

ఈసీ ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది ఈ ఆదేశాలు జారీ చేసారు. ‘ఓట్ల లెక్కింపుపై సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. దీనికి మీరంతా హాజరు కావాలి’ అని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది రిటర్నింగ్‌ అధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్లు, అధికారులతోపాటు ఎస్పీలకు ఉత్తర్వులు పంపించారు. ఈ ఉత్తర్వులు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే రాష్ట్ర పరిపాలనాధికారి! రాష్ట్రంలో అత్యున్నత అధికారి ఆయనే. అదంతా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేదాకానే! ఒక్కసారి కోడ్‌ అమలులోకి వచ్చిందంటే... కలెక్టర్లందరూ రిటర్నింగ్‌ అధికారులవుతారు. ఎస్పీలు, పోలింగ్‌తో ప్రత్యక్ష సంబంధముండే అధికారులు, సిబ్బంది మొత్తం నేరుగా సీఈవో పర్యవేక్షణలోకి వెళతారు.

lv 24042019

వారిపై సీఎస్‌ ఎలాంటి ఆజమాయిషీ చేయజాలరు. ఎలాంటి సమీక్షలు నిర్వహించాలన్నా సీఈవోకు అధికారం ఉంటుంది. ఎందుకంటే సీఈవోను నేరుగా ఈసీ నియమిస్తుంది. సీఈవో ప్రభుత్వ యంత్రాంగం పరిధిలో.. సీఎం పరిధిలో కూడా ఉండరు. ఒక స్వతంత్ర వ్యవస్థలా పనిచేస్తారు. స్వతంత్య్ర వ్యవస్థ కిందే ఎన్నికల సంబంధిత పనులు, సమీక్షలు, కౌంటింగ్‌, భద్రత ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షలు జరుగుతాయి. సీఎస్‌కు ఈ సమీక్షలతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే.. సీఎ్‌సకు ఎన్నికల నిర్వహణతో సంబంధమే ఉండదు. ఈ నేపథ్యంలో.. వచ్చేనెల 23న ఓట్ల లెక్కింపుపై ఎలాంటి సమీక్ష సమావేశమైనా సీఈవోనే నిర్వహించాలి. అది ఆయన అధికారం. అలాంటి.. కౌంటింగ్‌పై బుధవారం సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష పెట్టాలనుకోవడం ఒక వింత! ‘సీఎస్‌ నిర్వహించే సమీక్షలో పాల్గొనండి’ అని సీఈవో కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులను ఆదేశించడం మరో వింత!

Advertisements

Advertisements

Latest Articles

Most Read