మన దేశంలో సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 20 రోజులు పై నుంచి, పరిస్థితి ఇలాగే ఉంది. అయితే అయుదు రాష్ట్రాల ఎన్నికలు అంటూ, వివిధ రాజకీయ పార్టీలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా, పెద్ద పెద్ద మీటింగ్ లు, ర్యాలీలు పెట్టటం వివాదస్పదం అయ్యింది. ఎవరు ఎన్ని చెప్పినా , ఎవరూ వినిపించుకోలేదు. అయితే ఇప్పుడు ఇదే అంశం పై, మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పై, మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. దేశంలో ఈ రోజు ఉన్న పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ దే బాధ్యత అంటూ నిప్పులు చెరిగింది. ఎలక్షన్ కమిషన్ పై హత్య కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని ప్రాసిక్యూట్ చేయాలని ఆగహ్రం వ్యక్తంక్ చేసింది. కనీసం ఓట్ల లెక్కింపు రోజు అయినా, తగు జాగ్రత్తలు తీసుకోవలని, తీసుకొని పక్షం పై, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఆపేస్తామని, తమకు పూర్తి ప్రణాళిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read