సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శంషాబాద్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో రూపకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. మాగంటి రూప తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మురళీమోహన్ గెలవగా.. ఆయన పోటీకి దూరంగా ఉండటంతో ఆ సీటును ఆయన కోడలికి టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. మురళీమోహన్ తల్లి వసుమతిదేవి (100) గురువారం ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. రూప ఆ కార్యక్రమానికి వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

roopa 19042019 1

మురళీమోహన్ తల్లి మాగంటి వసుమతిదేవి (100) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా.. ఇటీవల మురళీమోహన్ తన తల్లి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వసుమతీదేవి కుటుంబానికి చెందిన సుమారు 100 మందికి పైగా హాజరయ్యారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీసంకరపురం గ్రామంలో వేడుకలు నిర్వహించగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఇటీవల మాతృ దినోత్సవ సందర్భంగా.. ‘తన శరీరం నుంచి ఇంకొకశరీరం పుట్టు కొస్తుందనే ఆలోచన అద్భుతంతంగా ఉంటుంది, ఆ అనుభవం ఒకతల్లికీ తప్పవేరెవరికి ఉండదు. అందుకే తల్లికి తన సంతానంపై అంత మమకారం’ అంటూ తన తల్లికి శుభాకాంక్షల్ని తెలియజేశారు మురళీమోహన్.

Advertisements

Advertisements

Latest Articles

Most Read