దేశంలో పెరిగిపోతున్న క-రో-నా తీవ్రత పై ప్రధాని మోడి జాతినుద్దేశించి ప్రసంగించారు. క-రో-నా పై జాతి మొత్తం, కఠినంగా పోరాటం చేస్తున్నాం అని అన్నారు. సెకండ్ వేవ్ అనేది తుఫానులా దూసుకుని వచ్చిందని మోడీ అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడి అన్నారు. మన దేశంలో ఆక్సిజన్ కు డిమాండ్ బాగా పెరిగిపోయిందని, ఎలాంటి విపత్కర పరిస్థితిని అయినా ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోడీ అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిన పెంచే ప్రయత్నం చేస్తున్నాం అని, డిమాండ్ కు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ప్రజలు ఎక్కడా ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. అలాగే వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచాలని, అన్ని ఫర్మా కంపెనీలను ఆదేశాలు ఇచ్చామని అన్నారు. దేశం మొత్తం, భారీగా క-రో-నా ఆసుపత్రులు ప్రారంభం చేస్తున్నాం అని అన్నారు. మనం వ్యాక్సినేషన్ లో ముందు ఉన్నాం అని, ఇంకా ఇంకా వ్యాక్సిన్ డోస్ లు పెంచటానికి చూస్తున్నాం అని, ఇప్పటి వరకు 12 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసాం అని అన్నారు. 18 ఏళ్ళు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితి రాకుండా, మనమే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, చివరి అస్త్రంగానే లాక్ డౌన్ విధించాలని అన్నారు. అయితే అనేక మౌళిక సమస్యలు ఉన్నా, ప్రధాని వాటి గురించి ప్రస్తావించకుండా, కేవలం ప్రజలకు నాలుగు మంచి మాటలతో ధైర్యం చెప్పే పనే చేసారని, పలువురు విమర్శిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read