కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా మోసం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. మీకు అన్నీ ఇస్తాం అని నమ్మించి మోసం చేసారు. మూడున్నర ఏళ్ళు తరువాత కూడా, అదిగో ఇదిగో అని మోసం చెయ్యాలని చూస్తూ ఉండటంతో, చంద్రబాబు వెంటనే తేరుకున్నారు. కేంద్రం మనల్ని నమ్మించి, మోసం చేస్తుందని గ్రహించారు. కేంద్రంతో పోరాటం ఎంచుకున్నారు. ముందుగా రెండు నెలల పాటు ఆందోళన చేసారు. మిత్రపక్షంగా ఉంటూనే, పార్లమెంట్ లో, బీజేపీ పై పోరాడారు. అప్పటికీ కేంద్రం దిగి రాకోవటంతో, మంత్రుల చేత రాజీమానా చేపించారు, చివరగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, మోడీ పై పూర్తి స్థాయి పోరాటం మొదలు పెట్టారు. మనం పోరాటం చేస్తుంది, విభజన హామీల కోసం.

modishah 19092018

అయితే, ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీలో చెప్పిన విషయం వింటే, విభజన హామీల కంటే, ఘోరమైన మోసం చేస్తుంది కేంద్రం. ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్నామని, ఈ విషయం గ్రహించిన ఢిల్లీ పెద్దలు, ఇలా అయితే తెలుగు రాష్ట్రాలు కలిస్తే, తెలుగు వారి బలపడతారాణి భావించి, టీఆర్ఎస్, టీడీపీ కలవకుండా అడ్డుకుందని ఆరోపించారు. బీజేపీ పెద్దలు, రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం తగువులు పెడుతోందని మండిపడ్డారు. టీడీపీని దెబ్బతీయడం, ఏపీకి అన్యాయం చేయడమే బీజేపీ ఉద్దేశం అని కేంద్రం తీరును దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకుండా చూసి, తద్వారా లబ్ది పొందాలనుకుంటున్న బీజేపీ కుట్రను చంద్రబాబు బయట పెట్టారు.

modishah 19092018

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత, కొన్నాళ్ళు ఆ విభజన వేడి ఉన్నా, చంద్రబాబు ముందు చూపుతో అమరావతి వచ్చేయటంతో, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకటం ప్రారంభించారు. చంద్రబాబు చొరవ తీసుకుని కెసిఆర్ ను అమరావతి శంకుస్థాపనకు కూడా పిలిచారు. తరువాత కెసిఆర్ కూడా హోమం ఎదో చేస్తూ, చంద్రబాబుని ఆహ్వానించారు. చిన్న చిన్న ఇబ్బందులు మినిహా, రెండు రాష్ట్రాల మధ్య పెద్దగా ఇబ్బందులు లేవు. అవిశ్వాస తీర్మానం చర్చ కంటే ముందు జరిగిన సమావేశాల్లో ప్రత్యెక హోదాకి కెసిఆర్ పూర్తి మద్దతు కూడా ప్రకటించారు.

modishah 19092018

ఇరు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన వాటి పై, కేంద్రంతో పోరాడి సాధించుకుందాం అని కూడా చెప్పారు. అయితే ఏమైందో ఏమో కాని, అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే సరికి, దేశంలో అన్ని పార్టీలు సహకరించినా, తెరాస మాత్రం సహకరించలేదు. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిందో, తెరాస అప్పటి నుంచి కేంద్రానికి దగ్గరయింది. దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతగా ఉంటే, కేంద్రానికి ఇబ్బందులు వస్తాయని గ్రహించి, తెలుగు జాతిలో చీలీక తెచ్చారని, కెసిఆర్ ని నా పై ఉసుగొలుపుతున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతికి ద్రోహం చెయ్యాలనుకునే ఎవరూ బాగుపడలేదని, అది చరిత్ర చెప్తున్న సత్యమని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read