తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు మూడో రోజు ఆయన, నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. గత రెండు రోజులుగా ఆయన చూసిన ప్రజల బాధలు, ప్రభుత్వ వైఫల్యం గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వరదల వల్ల ప్రజలు ఎదురుకున్న ఇబ్బందులు, ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు గురించి చంద్రబాబు వివరించారు. ఇదే సందర్భంలో, చంద్రబాబు మాట్లాడిన తరువాత, కొంత మంది విలేఖరులు చంద్రబాబున ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఒక విలేఖరి, ఈ మధ్య ముద్రగడ రాసిన లేఖ గురించి చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ముద్రగడ రాసిన లేఖను మీరు చూసే ఉంటారు, మిమ్మల్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల పై, మీ స్పందింన ఏమిటి అంటూ, ఆ విలేఖరి చంద్రబాబుని ప్రశ్నించారు. దీని పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ప్రశ్నకు ఇది సందర్భామా అని ప్రశ్నించారు. ఆ విలేఖరి మళ్ళీ మళ్ళీ రెట్టించి అడగగా, కాపులకు రిజర్వేషన్ లు ఇచ్చింది మేము, విదేశీ విద్య ఇచ్చింది మేము, మాకు లేఖలు రాస్తాడు కానీ, ఇవి ఎత్తేసిన వారికి మాత్రం లేఖలు రాయడు అంటూ సమాధానం చెప్పారు.

mudrgada 25112021 2

చంద్రబాబు మాట్లాడింది యధావిధగా "రిజర్వేషన్ పెట్టిన వాడి పైన లేఖలు రాస్తాడు. విదేశీ విద్య పెట్టిన వాడి పైన లేఖలు రాస్తాడు. అదే రిజర్వేషన్ లు ఎత్తేసిన వాడి పైన లేఖలు రాయడు. విదేశీ విద్య ఎత్తేసిన వాడి పైన లేఖలు రాయడు. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రశ్నలకు, ఇలాంటి వాళ్ళ చేష్టలకు నేను డైవర్ట్ కాను. నేను ఇక్కడకు వచ్చింది వరదలు కోసం వచ్చాను. వరదల్లో రాని వారిని మీరు అడగాలి. అలాంటి వారిని మీరు ప్రశ్నించండి. ఇలాంటి వాటి పైన కాదు." అంటూ చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో వైసీపీ నాయకులు తిట్టటంతో, చంద్రబాబు బాధపడిన విషయం తెలిసిందే. చంద్రబాబుని మరింతగా రెచ్చగొట్టటానికి, వైసీపీ పైడ్ ఆర్టిస్ట్ లు అందరూ రంగంలోకి దిగారు. అందులో ముద్రగడ క్యారక్టర్ కూడా ఎంటర్ అయ్యి, చంద్రబాబుని ప్రశ్నిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు జగన్ బాధలో ఉన్నా బయటకు వచ్చే ముద్రగడ, కాపులకు జరుగుతున్న అన్యాయం విషయంలో మాత్రం నోరు ఎట్టకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read