ముద్రగడ పద్మనాభం గురించి తెలియని వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండరు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా, ఆయనకు పేరు ఉంది. అయితే విచిత్రమో, ఏమో కాని, ఆయన ఈ కాపు ఉద్యమం కేవలం చంద్రబాబు అధికారంలో ఉండగా మాత్రమే చేస్తారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ఇలాగే ఉద్యమాలు చేసారు. తలకు రివాల్వర్ పెట్టుకుని, చచ్చిపోతానని బెదిరించారు కూడా. తరువాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగా, అప్పుడు అసలు కాపు ఉద్యమం అనే మాటే ఎత్తలేదు. అసలు కాపుల గురించి పట్టించుకోలేదు కూడా. ఆయన వ్యాపారాలు, ఆయన చేసుకుంటూ కలాం గడిపేసారు. తరువాత, మళ్ళీ 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే, మళ్ళీ కాపు ఉద్యమం తెర మీదకు తీసుకు వచ్చారు. చంద్రబాబు కాపు రిజర్వేషన్ ఇస్తాను అన్నారని, ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఉద్యమం మొదలు పెట్టారు. చివరకు అది రత్నాచల్ ఎక్ష్ప్రెస్ తగలబెట్టె దాకా వెళ్ళింది. తరువాత కూడా అనేక సార్లు, చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

mudragada 15012020 2

ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే, కాపు రిజర్వేషన్ పై ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే, కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ, కేంద్రానికి తీర్మానం పంపించారు. అయితే కేంద్రం మాత్రం , ఇది ఒకే చెయ్యకుండా నాన్చుతూ వచ్చింది. తరువాత కేంద్రమే ఈబీసీ రిజర్వేషన్ 10 శాతం ఇవ్వటంతో, మన రాష్ట్రంలో జనాభా ప్రకారం 5 శాతం రిజర్వేషన్ కాపులకు ఇచ్చారు చంద్రబాబు. ఇక కాపు కార్పొరేషన్ పెట్టి, ఏడాదికి వెయ్య కోట్లు ఖర్చు పెట్టారు కూడా. అయినా అప్పట్లో ముద్రగడ శాంతించే వారు కాదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో రాగానే సైలెంట్ అయిపోయారు. జగన మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ ఎత్తేస్తే, కేవలం ఒక్క ఉత్తరం రాసి కూర్చుకున్నారు.

mudragada 15012020 3

చంద్రబాబు హయంలో కాపు రిజర్వేషన్ ద్వారా, 43 వేల మందికి ఇచ్చిన రుణాలు, జగన్ రద్దు చేస్తే ముద్రగడ మాట్లాడటలేదు. కాపు కార్పొరేషన్ నిధులు ఇప్పటి వరకు, జగన్ మోహన్ రెడ్డి రూపాయి ఖర్చు పెట్టక పోయినా ముద్రగడ మాట్లాడటలేదు. కాపు కార్పొరేషన్ నిధులు, దారి మళ్ళిస్తుంటేముద్రగడ మాట్లాడటలేదు. పవన్ కళ్యాణి ని లంxxx అని, జగన్ తన రెడ్డి ఎమ్మెల్యే చేత తిట్టిస్తే ముద్రగడ మాట్లాడటలేదు. అయితే రెండు రోజుల క్రిందట చంద్రబాబుని నిందిస్తూ ముద్రగడ లేఖ రాసారు. అక్కడ కూడా కులాన్ని రెచ్చగొట్టారు. అమరావతి ఉద్యమంలో, మహిళలు పై ఎందుకు దాడి చేస్తున్నారు అని చంద్రబాబు అడిగితే, దానికి చంద్రబాబుని నిందిస్తూ లేఖ రాసారు. అంటే ఇక్కడ ముద్రగ ప్రయారిటీ, జగన్ కి చెడ్డ పేరు రాకుండా కాపాడటమేనా, కాపుల సమస్యల పై కాదా, అనే సందేహాలు కలుగుతున్నాయి. ముద్రగడ మరి ఈ అపవాదు నుంచి బయట పడతారో లేదో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read