ఒక పక్క సినిమా ఇండస్ట్రీ పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కక్ష సాధింపు ధోరణి కొనసాగుతుంటే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం, నాగార్జున సినిమాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క-రో-నా విపరీతంగా పెరిగిపోతుందని, అనేక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రధానంగా నైట్ కర్ఫ్యూ కాగా, మరొకటి సినిమా ధియేటర్లలో 50 శాతం మాత్రమె ఆక్యుపెన్సీతో సినిమా హాల్స్ నడవాలి అని. అయితే మొదటగా, నిన్నటి నుంచే ఇవి అమలులోకి వస్తుందని చెప్పారు. అయితే ఉన్నట్టు ఉండి, వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పండగల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, 17 నుంచి ఇవి అమల్లో ఉంటాయని ఉత్తర్వులు ఇచ్చారు. కరోనా ఆంక్షలు అంటే, పెట్టాల్సిందే ఇప్పుడు కదా, అనే అభిప్రాయం వ్యక్తం అవుతంది. పండుగలకు ఎక్కువ మంది గుమికూడకుండా, మరీ ముఖ్యంగా సినిమా హాల్స్ లో ఆంక్షలు ఉండాలి. అలాంటి ప్రభుత్వం వాయిదా వేసింది. 14న బంగార్రాజు సినిమా వస్తుంది. ఇది నాగర్జున నటించిన సినిమా కావటం, పండుగ సీజన్ లో విడుదల కావటం, మరే సినిమా కూడా లేకపోవటం, ఇప్పుడు ప్రభుత్వ ఆంక్షలు కూడా లేకపోవటంతో, నాగర్జునకి ఈ నిర్ణయం ఒక గిఫ్ట్ అనే చెప్పాలి. మొన్న నాగర్జున , జగన్ ను సమర్ధిస్తూ మాట్లాడారు కాబట్టి, ఇది రిటర్న్ గిఫ్ట్ ఏమో అంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read