తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల్ మీరా పై వైయస్సార్ పార్టీలో చేరుతున్నట్లు గత కొంత కాలంగా, వైసీపీ బ్యాచ్ సోషల్ మీడియా వేదికగా విపరీత ప్రచారం చేస్తుంది. దీంతో విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపధ్యం లో నాగుల్ మీరాపై ఇటువంటి వార్తలు వెలువడటంపై అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. వైకాపాలో చేరితే ఆయన కిచ్చే పదవిపై కూడా ఇటు వైకాపా నాయకులు, కార్యకర్తల్లోను ఫేక్ ప్రచారం జరిగేలా ఫేక్ బ్యాచ్ ప్రచారం చేస్తుంది. అయితే వీట న్నింటికి నాగుల్ మీరా చెక్ పెట్టారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వారికీ ఘాటుగా బదులు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం వీడియో ద్వారా ఆయన ట్రోలర్స్ పై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు. కావాలనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పీఆర్పీ పార్టీ నుంచి తాను రాలేదని, పార్టీలు మారే మన స్తత్వం తనది కాదని, సిద్ధాంతాలున్న కమ్యూనిస్టుపార్టీ నుంచి వచ్చానని తాను విలువలు ఉన్న నాయకుడినంటూ వైకాపా నాయకులకు చురకలంటించారు. దీంతో ఎట్టకేలకు నాగుల్ మీరాపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఊహగానాలకు చెక్ పడినట్లయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read