సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. నిన్న ఆహా ఈవెంట్ కి బాలయ్య విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం బాలయ్య, దుర్గమ్మని దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం, వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని, మీడియా పాయింట్ వద్ద బాలయ్య మాట్లాడటానికి వచ్చారు. ఈ సందర్భంగా అయన ఇబ్బంది పడ్డారు. మీడియా పాయింట్ ప్రభుత్వ శాఖ అయిన, సమాచారశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రజాప్రతినిధులు, హీరోలు, ఇతర విఐపిలు దర్శనం అనంతరం వచ్చి, మీడియాతో మాట్లాడుతూ ఉండే వారు. అయితే బాలయ్య వస్తున్నారని తెలిసినా, మీడియా పాయింట్ దగ్గర సమాచారశాఖ నిర్ల్యక్షం ప్రదర్శించింది. ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా, అక్కడ మైక్ పెట్టలేదు. మీడియా పాయింట్ వద్ద మైక్ లేకపోవటంతో, బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేసారు. అక్కడ భక్తులు అరుపులు, కేకల మధ్యే బాలయ్య మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీసులు అందరి పై ఉండాలని అమ్మ వారిని కోరుకున్నా అని చెప్పిన బాలయ్య, రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read